Road Accident: వరంగల్ లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో తండ్రి కూతురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal: సంతోషం వెల్లివిరియాల్సిన పండుగ వేళ ఓ కుటుంబంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. పండుగ వేళ కూతురిని అల్లుడుని పిలిచి సారి పెట్టాలనుకున్న కుటుంబం చావు కబురు వినాల్సి వచ్చింది. సంతోషంగా అల్లుడుతో కలిసి రావాల్సిన కూతురు విగత జీవిగా మారింది. తండ్రి కూతురు ఒకేసారి ఈ లోకాన్ని వదిలి అనంతలోకాలకు వెళ్లారు. ఈ హృదయ విదారక ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం లోని మొరిపిరాలకు చెందిన వెంకన్న కూతురు అనూష, అల్లుడు రాజేశ్ హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. అయితే దసరాకు కుమార్తెని అల్లుడిని ఇంటికి తీసుకురావాలని ఆశపడ్డారు వెంకన్న.. అయితే అతని ఆశ అడియాస అయింది.
Read also:Cyclone Tej: పెరగనున్న తేజ్ తుఫాను తీవ్రత.. ఈ రాష్ట్రానికి ముప్పు
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
కూతురుని అల్లుడిని తీసుకు రావడానికి హైదరాబాద్ వెళ్లిన వెంకన్న.. కూతురుని అల్లుడిని హైదరాబాద్ నుంచి మెరిపిరాలకు తీసుకు వస్తున్న సమయంలో ప్రమాదానికి గురైయ్యారు. రాయపర్తి మండలం కిష్టాపురం సమీపానికి రాగానే వాళ్లు ప్రయాణిస్తున్న బైక్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకన్న అతని కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా రాజేష్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇది గమనించిన స్థానికులు రాజేష్ ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకి సమాచారం అందిచారు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కార్ డ్రైవర్ పరారీలో ఉన్నారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
-
SKN: కెరీర్ మన క్రష్ అయినప్పుడు ఏ క్రష్ అయినా మన వెంట రావాల్సిందే
-
IMD Warning: జూలైలో వర్షాలు నిరాశాజనకంగా ఉంటాయి.. ద్రవ్యోల్బణంపై బిగ్ అలర్ట్
-
Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
-
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు ‘రైతు భరోసా’ నిధులు విడుదల!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!