Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Kamareddy Farmers Of Rameshwar Palli Filed A Rit Petition In The High Court

Kamareddy Master Plan: హైకోర్టుకు రైతులు.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం

Published Date :January 7, 2023 , 11:25 am
By NTV WebDesk
Kamareddy Master Plan: హైకోర్టుకు రైతులు.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kamareddy Master Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతులు హైకోర్టు మెట్లెక్కారు. హైకోర్టు లో కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డ్ రామేశ్వర్ పల్లి రైతులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తమను సంప్రదించకుండా భూములను రీక్రియేషనల్ జోన్ గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ అన్నదాతలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు రైతుల రిట్‌ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టనున్నట్టు సమాచారం. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ చూస్తే కేవలం తమను ఇబ్బంది పెట్టేందుకే అన్నట్టుగా ఉందని రైతులు వాపోతున్నారు. న్యాయం కోసం అవసరమైతే సుప్రీం కోర్ట్ తలుపు తట్టేందుకైనా సిద్ధమంటున్న రైతులు. హైకోర్టులో న్యాయం జరగపోతే.. సుప్రీం కోర్టు మెట్లు ఎక్కేందుకైనా సిద్దంగా ఉన్నామని చెబుతున్నారు. పంట పొలాలు దూరమైతే మేము రోడ్డున పడాల్సి వస్తుందని, నోటి కాడ కూడును లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని వాపోతున్నారు. దీనిపై కలెక్టరేట్‌ ముట్టడికి బయలు దేరారు. అయితే నిన్న రెండోరోజు రైతుల ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. కామారెడ్డి బంద్ ను ప్రకటించిన రైతులు కలెక్టరేట్‌ ముట్టడికి బయలు దేరిన సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పలువురు కాంగ్రెస్‌ నేతలను, నిన్న రాత్రి బండి సంజయ్‌ ను కూడా అదుపులో తీసుకున్నారు. బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిన్న రైతులపై దాడి, అరెస్ట్‌ లపై మండి పడ్డ రైతులు ఇవాళ కూడా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇప్పటి వరకు కలెక్టర్‌ స్పందించకపోవడం.. రైతులతో మాట్లాడకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్‌ ప్లాన్‌ వెనక్కి తీసుకునేంత వరకు వెనక్కి తగ్గేదేలేదని, ఆందోళన కొనసాగిస్తామని రైతులు చెబుతున్నారు.

Read also: Rain Alert: అలెర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Also Read

  • RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
  • Bank Fraud: SBI బ్యాంక్‌లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్‌తో పాటు..
  • Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
  • KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

అయితే.. నిన్న రైతులపై దాడికి నిరసనగా నేడు కలెక్టరేట్ దగ్గర రైతుల ఆందోళన చేపట్టనున్నారు. అడ్లూర్ ఎల్లారెడ్డి లో టీపీసీసీ రేవంత్ రెడ్డి పర్యటన పై ఉత్కంఠ కొనసాగుతుంది. నిన్న బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తత తో రేవంత్ పర్యటన డైలమాలో ఉన్నట్లు తెలుస్తుంది. అటు కలెక్టర్ తీరుపై రైతుల ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు రైతులను కలెక్టర్ కలవలేదని మండిపడుతున్నారు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో.. నిన్న రాత్రి కలెక్టరేట్ ముట్టడి తో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. పోలీసు వాహనం ధ్వంసం ఘటనలో 20 మంది పై కేసులు నమోదు చేశారు. బీజేపీ నేతలు కార్యకర్తలు, పలువురు రైతుల పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ముగ్గురు రైతులు చికిత్స పొందుతుంది. నేడు రైతులకు మద్దతుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటన ప్రశ్నార్థకంగా మారింది. అడ్లూర్ ఎల్లా రెడ్డి లో రైతులను రేవంత్ రెడ్డి పరామర్శించనున్నట్లు సమాచారం. అయితే నిన్న బండిసంజయ్‌ అరెస్ట్‌ తో ఉద్రికత్త నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో రేవంత్‌ రైతుల ఆందోళనకు మద్దతు ఇస్తారా? రైతులకు పరామర్శించేందుకు పోలీసులు అనుమతి ఇస్తారా? అనే ప్రశ్నలు చర్చకు దారితీస్తున్నాయి. ఇవాళ రైతుల ఆందోళనకు మూడు రోజుకు చేరింది. అయితే ఇప్పటి వరకు కూడా కలెక్టర్‌ స్పందిచక పోవడం.. ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో సర్వత్రా ఉత్కంఠంగా మారింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం గానీ, కలెక్టర్‌ గానీ రైతులతో మాట్లాడకపోవడంతో రైతుల ఆందోళన మరింత పటిష్టంగా మారింది. అయితే దీనిపై రెండు రోజులముందు కేటీఆర్‌ మట్లాడిన విసయం తెలిసిందే. అధికారులపై కూడా మంత్రి సీరియస్‌ అయ్యారు. ఏమైనా ఉంటే అధికారులతో ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని కోరారు మంత్రి. అయితే అదంతా పక్కనపెట్టిన రైతులు కలెక్టరేట్‌ వద్ద ఆందోళన కొనసాగించారు. దీనికి మద్దతుగా టీ.కాంగ్రెస్‌ నేతలు, బీజేపీ పలికింది. దీంతో రైతుల ఆందోళనకు మరింత బలం చేరుకుంది. మరి ఇవాళ చేపడుతున్న రైతుల ఆందోళనకు రేవంత్‌ వెళ్తారా? అనేది ఉత్కంఠంగా మారింది.

అసలేం జరిగింది:

అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన పయ్యావుల రాములుకు కామారెడ్డి పట్టణ శివారులోని ఇలిచపూర్‌ వద్ద 3 ఎకరాల సాగుభూమి ఉంది. అయితే.. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన రాములు ఆ భూమిని గతంలోనే అమ్మకానికి పెట్టాడు. కాగా.. మున్సిపల్‌ నూతన మాస్టర్‌ప్లాన్‌ ప్రతిపాదనల్లో ఆయన భూమిని ఇండ్రస్టియల్‌ జోన్‌లోకి మార్చడంతో భూమి అమ్ముడుపోవడం లేదు. అయితే.. మనస్తాపానికి గురైన రాములు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో.. మాస్టర్‌ ప్లాన్‌ బాధిత రైతులు మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తీసుకుని బల్దియా వద్ద ఆందోళన చేయడానికి బయలుదేరారు. వారిని పోలీసులు కామారెడ్డి బస్టాండ్‌ వద్ద అడ్డుకోవడంతో.. పోలీసులకు రైతులకు వాగ్వాదం జరిగింది. అయితే.. రైతులు మృతదేహాన్ని అక్కడే వదిలేసి బల్దియా కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేశారు. కాగా.. పోలీసులు కొత్తబస్టాండ్‌ వద్దనున్న మృతదేహాన్ని అశోక్‌నగర్‌ కాలనీ, రైల్వేగేట్, పాత బస్టాండ్‌ మీదుగా జిల్లా ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్‌ నూతన మాస్టర్‌ప్లాన్‌ వెనక్కి తీసుకోవాని ఆదారంగా వున్న పంటపొలాలను లాక్కునేందుకు మాస్టర్‌ప్లాన్‌ అంటూ ఆందోళనకు దిగారు. మరి దీనిపై రైతులకు హైకోర్టులో న్యాయం జరిగేనా? చర్చ జరుగుతుంది. ఒక వేళ హైకోర్టులో న్యాయం జరగకపోతే.. సుప్రీం కోర్టుకు వెళతామంటున్నారు రైతులు. హైకోర్టులో సోమవారం జరిగే రైతుల రిట్‌ పిటిషన్‌ పై సర్వాత్రా ఆశక్తి నెలకొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Farmers of Rameshwar Palli
  • high court
  • Kamareddy master plan
  • Rit petition
  • Suprim Court

తాజావార్తలు

  • Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

  • RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..

  • Ukraine: ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions