Hyderabad:భూ.. వివాదంలో మంత్రి మల్లారెడ్డి బామ్మర్ది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి మల్లారెడ్డి అలాగే.. ఆయన కుటుంబ సభ్యుల చుట్టూ భూ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. ఇప్పటికే పలు సందర్భాల్లో మంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలు రాగా.. తాజాగా మరోసారి మంత్రి మల్లారెడ్డికి చిక్కుల్లో పడినట్టు అయ్యింది.. ఎందుకంటే.. మంత్రి మల్లారెడ్డి బామ్మర్ది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ ఛైర్పర్సన్ భర్త అయిన ముద్దుల శ్రీనివాసరెడ్డి భూ వివాదంలో చిక్కుకున్నాడు.
భూ వివాదంలో మంత్రి మల్లారెడ్డి బామ్మార్ది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ భర్త మద్దుల శ్రీనివా్సరెడ్డితో పాటు 15 మందిపై కేసు నమోదైంది. పేట్బషీరాబాద్ సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని సర్వేనంబర్ 5, 6లలో భూ యజమానులు మల్లారెడ్డి, వేణునాయుడుల మధ్య కొన్నిరోజులుగా భూ వివాదం నడుస్తోంది.
Also Read
- CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
- CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
- విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
- Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
కాగా, మూడు రోజులక్రితం.. ఆదివారం అర్ధరాత్రి సమయంలో మల్లారెడ్డికి సంబంధించిన వ్యక్తులు మద్యం సేవించి స్థలం చుట్టూ ఉన్న కడీలను పడగొట్టి, అక్కడున్న సెక్యురిటీ సిబ్బందిని తీవ్రంగా గాయపరిచారు. స్థలం వద్ద నానా హంగామా సృష్టించి తీవ్ర భయాందోళన కలిగించారు. దీంతో వేణునాయుడు ఫిర్యాదు మేరకు 15 మంది నిందితులపై కేసు నమోదు చేసి, 10 మందిని బుధవారం రిమాండ్ తరలించామని సీఐ రమేష్ తెలిపారు. కాగా, మరో ఐదుగురు.. మల్లారెడ్డి, మద్దుల శ్రీనివా్సరెడ్డి, విద్యాసాగర్రెడ్డి, నరసింహారెడ్డి, బశ్చేందర్ సింగ్ పరారీలో ఉన్నారని తెలిపారు. త్వరలోనే వారిని కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తామని సీఐ పేర్కొన్నారు.
డిసెంబర్ 9 2020లో తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైన విషయం తెలిసిందే. కుత్బుల్లాపూర్ మండలం సూరారంలో తన భూమి కబ్జా చేశారని శ్యామలదేవి అనే మహిళ దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంత్రి అనుచరులు తనకున్న రెండు ఎకరాల 13 గుంటల భూమిలో 20 గుంటలు కబ్జా చేసి ప్రహరీగోడ నిర్మించారని ఆరోపించారు. మంత్రి ఆదీనంలో ఉన్న భూమిని విడిపించాలంటూ న్యాయవాదిని సంప్రదిస్తే.. ఆయనతో మంత్రి మల్లారెడ్డి కుమ్మక్కై తప్పుడు పత్రాలు సృష్టించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె తెలిపింది. శ్యామల ఫిర్యాదుతో మంత్రి మల్లారెడ్డి, ఆయన కొడుకుతోపాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Municipal Corporation : కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై ఒకటే మునిసిపల్ కార్పొరేషన్..
తాజావార్తలు
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
-
AP Weather: ఏపీలో విచిత్ర వాతావరణం.. ఓ వైపు పిడుగులు.. మరోవైపు భానుడి భగభగలు..
-
PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్లో కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!