Agnipath Protest : ఆర్మీ అభ్యర్థులు అరెస్ట్.. కుటుంబ సభ్యుల ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం సృష్టించిన ఆర్మీ అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో అభ్యర్థుల కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో చెప్పాలని అభ్యర్థుల కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఆర్మీ అభ్యర్థి మహేందర్ మేనమామ మాట్లాడుతూ.. 5ఏళ్ల నుంచి మహేందర్ ఆర్మీలో జాబ్ కొట్టాలని తీవ్ర కృషి చేస్తున్నాడని, నిన్న ఆర్మీ ఆఫీస్ కి వెళ్లి వినతిపత్రం ఇవ్వాలని సికింద్రాబాద్ కి వెళ్ళాడన్నారు.
ఇక్కడ నిన్న ఏం జరిగిందో ఎవరు ఇలా చేశారో తెలియదని, నిన్నటి నుండి మహేందర్ ఎక్కడున్నాడో ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడో తెలియదని ఆయన వెల్లడించారు. నిన్న 100కి కాల్ చేసి అడిగితే గోపాలపురం పీఎస్ కి వెళ్లి అడగమని చెప్పారని, ఉదయం అక్కడికి వెళ్లి అడిగిన కూడా పోలీసులు చెప్పటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడికి చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల కోసం వస్తున్నారని, పోలీసులు ఎలాంటి సమాచారం మాకు ఇవ్వటం లేదని ఆయన తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
AIMIM: వీడియో లీక్ వ్యవహారం.. మిర్జా రహమత్ బేగ్పై ఎంఐఎం వేటు..
-
Samantha: ప్రెగ్నెన్సీలో 11 కిలోలు పెరిగాను.. మాతృత్వంపై సమంత ఆసక్తికర కామెంట్స్!
-
CNG Price Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన CNG ధరలు.. కొత్త రేట్లు ఇవే!
-
Saturday Horoscope: ఆగస్టు 29 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్న్యూస్..
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!