Rose Gold Beauty Parlour: పార్లర్ పేరుతో మోసం.. రూ.3 కోట్లతో దంపతులు పరార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Rose Gold Beauty Parlour: బ్యూటీ పార్లర్ పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో మోసం చేసి మూడు కోట్ల వసూళ్లు చేసి ఉడాయించారు కిలాడి దంపతులు. దీంతో ఈ ఘటన హైదరాబాద్ లో సంచలనంగా మారింది.
హైదరాబాద్ లోని ప్రగతి నగర్ హెడ్ ఆఫీస్ అడ్డాగా అక్క సమీనా, బావ ఇస్మాయిల్, మరదలు జెస్సికా కలిసి.. నకిలీ బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు. రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో కోసం యూ ట్యూబ్ ఛానెళ్లతో యాడ్స్ ఇచ్చారు. కస్టమర్లను ఆకట్టుకునే విధింగా యాడ్స్ చేసి, ఎక్కువ డబ్బు వస్తుందని వారిని నమ్మించారు. ఆ యాడ్స్ చూసిన బాధితులు ఎక్కువ డబ్బు వస్తుందని ఆశపడ్డారు. రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ వారికి కాంటాక్ట్ అయ్యారు. వారి వలలో పడ్డ వారిని మిస్ అవకుండా రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ డబ్బుల వల వేశారు. దీంతో ఆ వలలో చిక్కుకున్న కస్టమర్లు లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. ఇరు నగరంలోనే కాదు.. జిల్లాల వారాగా పాకింది. బాధితులు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో వందల సంఖ్యలో ఉండటం గమనార్హం. ఒక్కో బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీ కోసం 3 లక్షల 20 వేలు దంపతులు వసూలు చేసినట్లు సమాచారం. 100 కి పైగా పార్లర్లు ఓపెన్ చేసి మూడు కోట్లతో ఉడాయించినట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీ తీసుకుంటే నెలకి 35 వేలు జీతం ఇస్తామని దంపతులు సమీనా, ఇస్మాయిల్ నమ్మించారు. దీంతో దంపతుల మాయమాటలు నమ్మి కొందరు మంగళ సూత్రాలు అమ్మి, అప్పు చేసి ఫ్రాంచైజీని తీసుకున్నారు. రెండు మూడు నెలల పాటు జీతం ఇచ్చారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.
Also Read
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
- ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
Read also: Aadi Srinivas: సిరిసిల్ల నేత కార్మికులకు 365 రోజులు పని కల్పించేలా జివో తెస్తాం..!
జీతం ఇవ్వడానికి రేపు, మాపు అంటూ కాలం గడిపారు.. వస్తాయని ఆశతో వున్న కస్టమర్లకు నెల నెల నిరాశే ఎదురైంది. చివరకు జీతాల కోసం దంపతులకు కాల్ చేయగా ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన బాధితులు హైదరాబాద్ లోని ప్రగతి నగర్ హెడ్ ఆఫీస్ కు చేరుకున్నారు. అక్కడకు వెళ్లిన కస్టమర్లు షాక్ తిన్నారు. హెడ్ ఆఫీస్ కు తాళం వేసి ఉండటంతో లబోదిబో మన్నారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టామని వాపోయారు. ఆ దంపతులను పట్టుకుని మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దంపతులకోసం గాలింపు చేపట్టారు. గతంలో కామారెడ్డి జిల్లాలోను చిట్ ఫండ్ పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసినట్టు ఆరోపణలు వున్నాయని పోలీసులు నిర్ధారించారు. ఇలాంటి వారిని ఎలా నమ్ముతున్నారో అర్థకావడంలేదన్నారు. ఇప్పటి కైనా ప్రజలు ఇలాంటి వారిపట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
True lover : “ట్రూ లవర్”గా మారిన “గుడ్ నైట్” హీరో.. మరో బేబీ లోడింగ్
తాజావార్తలు
-
Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!