Etela Rajender: కాంగ్రెస్-టీఆర్ఎస్ కలిసిపోవడం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు పలువురు టీఆర్ఎస్ నేతలు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ ఎంపీపీ తాడురి వెంకట రెడ్డి, మాజీ జెడ్పీటీసీ, మండల తెరాస పార్టీ మాజీ అధ్యక్షుడు పెద్దిటి బుచ్చి రెడ్డి, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కంది లక్ష్మా రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. సొంత పార్టీ నేతలకు వెల కడుతున్న నీచమైన పార్టీ టీఆర్ఎస్. ఇలా చేస్తే హుజూరాబాద్ ప్రజలు చెంప చెళ్లుమనిపించినా కూడా కెసిఆర్ కి బుద్ది రాలేదు.
Read Also: Mp Arvind: మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఎందుకంత ఉలుకు?
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
కెసిఆర్ పద్దతి పట్ల వెగటు పుట్టి ఆ పార్టీ నేతలు బయటికి వస్తున్నారు. అలా వచ్చే వారిపై కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారు. ఇలాంటి పిచ్చి వేషాలు వేయవద్దు. భయపెట్టింది లొంగ దీసుకుంటాం అంటే తెలంగాణ సమాజం లొంగదు. టీఆర్ఎస్ ను ఎదుర్కోనే ఏకైక పార్టీ బీజేపీ. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎన్నికల ముందో తరువాతనో కలిసిపోతాయి.. బీజేపీ కార్యకర్తలు, నాయకులు మనో నిబ్బరం కోల్పోవద్దు. ఇన్నేళ్లు పని చేసారు ఇంకో 6 నెలలు కష్టపడి పనిచేయండి అధికారం మనదే.. ప్రజాసంగ్రామ యాత్రపై దాడులు చేసినా ఎవరూ అధైర్య పడవద్దు అన్నారు ఈటల.
మరో బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వేడుకలను కేసీఆర్ రాజకీయం చేశారన్నారు. గవర్నర్లు నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వెళ్లక పోవడం తప్పు.దిగజారుడు రాజకీయాలు కేసీఆర్ చేస్తున్నారు. రాజకీయ దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. ప్రజాసంగ్రామ యాత్రకు వస్తున్న స్పందన చూసి కేసీఆర్ ఓర్వలేక పోతున్నారు. నెహ్రూ విగ్రహానికి కేసీఆర్ పూలదండ వేయడం.. కాంగ్రెస్ కు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంది. మునుగోడులో కాంగ్రెస్, టిఆర్ఎస్ కలిసి వ్యూహ రచన చేస్తున్నాయి. నితిష్ కుమార్ ని మధ్యవర్తిగా ఉంచి కాంగ్రెస్ కు దగ్గర కావడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. దాడులు చేసినా ప్రజాసంగ్రామ యాత్ర ఆగదన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.

Read Also: Asaduddin Owaisi: కాశ్మీర్ పరిస్థితికి మోదీ, అమిత్ షానే కారణం..
తాజావార్తలు
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
-
Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!