హుజూరాబాద్ ను జిల్లా చేయాలి : ఈటల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు ధర్మం వైపు ఉన్నారు. నా వైపు ఉన్నారు అని ఈటల రాజేందర్ అన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ… హుజూరాబాద్ ను
జిల్లా చేయాలి, వావిలాల,చల్లుర్ లను మండలం వెంటనే చేయాలి అని తెలిపారు. స్పీకర్ కనీసం నా రాజీనామా తీసుకోవడానికి కూడా ముందుకు రాకపోగా, రాజీనామా ఇచ్చిన అరగంటలోనే ఆమోదించి గెజిట్ విడుదల చేసిన చరిత్ర దేశంలో ఇదే కావొచ్చు. అంటే అంత తొందరగా నన్ను ఓడించాలని ఉబలాటపడుతున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా ఖాళీ చేయాలని ఫోన్ చేసి మరీ ఒత్తిడి చేశారు. నియోజకవర్గంలో ఉన్న అందరు అధికారులను మార్చారు. ప్రత్యేక అధికారులను నియమించుకున్నారు. సొంత పార్టీ నాయకులను అంగట్లో సరుకులుగా కొంటున్నారు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.
కుల సంఘాల నాయకులను సక్కగా రంగనాయక సాగర్ గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్ళాలి అక్కడ హరీష్ రావు గారు ఉండి బేరం కుదుర్చుకుంటారు. ఇవన్నీ కాక దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నియోజక వర్గం కానీ వారికి ఓటు ఇక్కడ కల్పిస్తున్నారు. నాకు పడే ఓట్ల ను తొలగిస్తున్నారు. హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ ఇంట్ల 34 ఓట్లు ఉన్నాయి. ఇంకో నేత ఇంట్లో 41 ఓట్లు నమోదు చేశారు. దొంగ పనులు, చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న అధికారుల మీద ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తాం. లేదంటే మా కార్యకర్తలే నిలువరించే ప్రయత్నం చేస్తాము. అధికారులు చట్ట ప్రకారం పని చేయండి, బానిసల్ల్లాగా కాదు. అలా చేస్తే మీకు శిక్ష తప్పదు. నియోజకవర్గ లో ఏ ఊరు పోయినా కెసిఆర్ ప్రభుత్వం చేసిన పని అత్యంత నీచంగా, జుగుప్ట్చకరంగా ఉంది అని అంటున్నారు. ఎంతో మందిని బయటికి పంపినా ఉద్యమం కదా అని ఊరుకున్నాము, కానీ ఇప్పుడు క్షమించేది లేదు అంటున్నారు. అవమానానికి బదలా తీర్చుకుంటామని అంటున్నారు. మైనారిటీ, క్రిస్టియన్ సోదరులు కూడా మద్దతు తెలుపుతున్నారు.
Also Read
- Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
- Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
- Lakshmis Empiria : వర్షాన్నీ లెక్కచేయని 5K రన్.. మియాపూర్లో సందడి.!
- Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
ఈ ఎన్నికల కేసీఆర్ కి, ఈటల రాజేందర్ గారికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ధర్మమే గెలుస్తుంది అని ప్రజలు అంటున్నారు. ఓటుకు లక్ష రూపాయల ఇచ్చినా తీసుకుంటాం కానీ ఓటు మాత్రం ఈటల కే వెస్తామంటున్నరు. కమాలపూర్ మండలం బత్తిని వాని పల్లి నుండి పాదయాత్ర మొదలు పెడతాము. మూడు నాలుగు రోజుల్లో శ్రీకారం చుడతాము. 350 కిలోమీటరు ఉంటుంది. పోలీసులు తెరాస కార్యకర్తల వ్యవహరిస్తున్నారు. నిజాం అణచివేతను విన్నాం కానీ ఇప్పుడు రాజు గారు ఎలా చెప్తే అలా చేస్తున్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఏమన్నా నిషేధిత పార్టీనా అని ప్రశ్నించారు. ఇక్కడ వ్యాపారం చేసుకోవాలి అంటే తెరాస మంత్రుల ను కలవాలని హుకుం జారీ చేస్తున్నారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట లో మాత్రమే డబుల్ బెడ్ రూం ఇల్లు పూర్తి చేశారు. నా దగ్గర కూడా 1500 డబుల్ బెడ్ రూం ఇల్లు కడుతున్నారు కానీ డబ్బులు ఇవ్వడం లేదు. ఎవరి జాగా లో ఇల్లు కట్టుకొనే అవకాశం కల్పించాలి. ఎవరి తాత జాగీరు కాదు, ప్రజల పన్నులే ప్రభుత్వ ఖజానా నుండి సంక్షేమ పథకాలు ఇస్తారు. స్కీములు ఆపడం ఎవరి వల్ల కాదు. గెలిచే సత్తా లేక, ప్రజలమీద నమ్మకం లేక వారు ఈ చేస్టలు చేస్తున్నారు అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!