హుజూరాబాద్ ను జిల్లా చేయాలి : ఈటల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు ధర్మం వైపు ఉన్నారు. నా వైపు ఉన్నారు అని ఈటల రాజేందర్ అన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ… హుజూరాబాద్ ను
జిల్లా చేయాలి, వావిలాల,చల్లుర్ లను మండలం వెంటనే చేయాలి అని తెలిపారు. స్పీకర్ కనీసం నా రాజీనామా తీసుకోవడానికి కూడా ముందుకు రాకపోగా, రాజీనామా ఇచ్చిన అరగంటలోనే ఆమోదించి గెజిట్ విడుదల చేసిన చరిత్ర దేశంలో ఇదే కావొచ్చు. అంటే అంత తొందరగా నన్ను ఓడించాలని ఉబలాటపడుతున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా ఖాళీ చేయాలని ఫోన్ చేసి మరీ ఒత్తిడి చేశారు. నియోజకవర్గంలో ఉన్న అందరు అధికారులను మార్చారు. ప్రత్యేక అధికారులను నియమించుకున్నారు. సొంత పార్టీ నాయకులను అంగట్లో సరుకులుగా కొంటున్నారు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.
కుల సంఘాల నాయకులను సక్కగా రంగనాయక సాగర్ గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్ళాలి అక్కడ హరీష్ రావు గారు ఉండి బేరం కుదుర్చుకుంటారు. ఇవన్నీ కాక దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నియోజక వర్గం కానీ వారికి ఓటు ఇక్కడ కల్పిస్తున్నారు. నాకు పడే ఓట్ల ను తొలగిస్తున్నారు. హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ ఇంట్ల 34 ఓట్లు ఉన్నాయి. ఇంకో నేత ఇంట్లో 41 ఓట్లు నమోదు చేశారు. దొంగ పనులు, చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న అధికారుల మీద ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తాం. లేదంటే మా కార్యకర్తలే నిలువరించే ప్రయత్నం చేస్తాము. అధికారులు చట్ట ప్రకారం పని చేయండి, బానిసల్ల్లాగా కాదు. అలా చేస్తే మీకు శిక్ష తప్పదు. నియోజకవర్గ లో ఏ ఊరు పోయినా కెసిఆర్ ప్రభుత్వం చేసిన పని అత్యంత నీచంగా, జుగుప్ట్చకరంగా ఉంది అని అంటున్నారు. ఎంతో మందిని బయటికి పంపినా ఉద్యమం కదా అని ఊరుకున్నాము, కానీ ఇప్పుడు క్షమించేది లేదు అంటున్నారు. అవమానానికి బదలా తీర్చుకుంటామని అంటున్నారు. మైనారిటీ, క్రిస్టియన్ సోదరులు కూడా మద్దతు తెలుపుతున్నారు.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
ఈ ఎన్నికల కేసీఆర్ కి, ఈటల రాజేందర్ గారికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ధర్మమే గెలుస్తుంది అని ప్రజలు అంటున్నారు. ఓటుకు లక్ష రూపాయల ఇచ్చినా తీసుకుంటాం కానీ ఓటు మాత్రం ఈటల కే వెస్తామంటున్నరు. కమాలపూర్ మండలం బత్తిని వాని పల్లి నుండి పాదయాత్ర మొదలు పెడతాము. మూడు నాలుగు రోజుల్లో శ్రీకారం చుడతాము. 350 కిలోమీటరు ఉంటుంది. పోలీసులు తెరాస కార్యకర్తల వ్యవహరిస్తున్నారు. నిజాం అణచివేతను విన్నాం కానీ ఇప్పుడు రాజు గారు ఎలా చెప్తే అలా చేస్తున్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఏమన్నా నిషేధిత పార్టీనా అని ప్రశ్నించారు. ఇక్కడ వ్యాపారం చేసుకోవాలి అంటే తెరాస మంత్రుల ను కలవాలని హుకుం జారీ చేస్తున్నారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట లో మాత్రమే డబుల్ బెడ్ రూం ఇల్లు పూర్తి చేశారు. నా దగ్గర కూడా 1500 డబుల్ బెడ్ రూం ఇల్లు కడుతున్నారు కానీ డబ్బులు ఇవ్వడం లేదు. ఎవరి జాగా లో ఇల్లు కట్టుకొనే అవకాశం కల్పించాలి. ఎవరి తాత జాగీరు కాదు, ప్రజల పన్నులే ప్రభుత్వ ఖజానా నుండి సంక్షేమ పథకాలు ఇస్తారు. స్కీములు ఆపడం ఎవరి వల్ల కాదు. గెలిచే సత్తా లేక, ప్రజలమీద నమ్మకం లేక వారు ఈ చేస్టలు చేస్తున్నారు అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!