మహబూబ్ నగర్ జిల్లాలో కిసాన్ మోర్చా నిర్వహించిన రైతు సదస్సులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరవై ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నానని, తెలంగాణ సాధన ఉద్యమంలో మహబూబ్ నగర్ జిల్లా జైలుకు వెళ్లానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం శిశుపాలుడిలాగ వంద తప్పులు చేసింది. ప్రజలు టీఆర్ఎస్ను శిక్షించి నన్ను గెలిపించారని, 101వ తప్పుకు కూడా ప్రజలు శిక్షిస్తారన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజల డబ్బుకు, సంపదకు కాపలాదారులు మాత్రమేనని, ప్రధాని నరేంద్ర మోడీ హూందాగా తన కర్తవ్యమని చెబుతారని, కేసీఆర్ నేనిచ్చానని చెప్పుతారన్నారు. గజ్వేల్లోని ఆయన సొంత భూములు అమ్మి ఇస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్ తప్పులు చేస్తూ రైతులను వెంటాడుతున్నారని, బాధ్యతతో మాట్లాడుతున్నాను. ఒక సందర్భంలో కేసీఆర్ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని మాకు చెప్పారు. ఒక రాష్ట్రంలో ఒక అవసరం ఉంటుందని, నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అన్నారు కదా? వ్యవసాయమే గ్రామీణ ఆర్థిక జీవనం. కంప్యూటర్ యుగంలో అన్నం పెట్టేది భూతల్లి మాత్రమే. అలాంటి వ్యవస్థను కాపాడాల్సింది పోయి వరి వేస్తే ఉరి అని స్వయానా సీఎం కేసీఆర్ చెప్పడం భావ్వమా? అని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షాలకు ప్రజల తరఫున కొట్లాడే బాధ్యత ఉంటుందని, ప్రజలు అధికారం ఇస్తే కుర్చీపై నుండి వెలకిలపడి ధర్నాలు చేస్తున్నారని, ప్రజల సమ్యలు పరిష్కరించకపోతే కుర్చీపై కూర్చునే అధికారం లేదని ఆయన వ్యాఖ్యానించారు.