Errabelli Dayakar Rao: బిఆర్ఎస్ ఇచ్చే మూడు పంటలు కావాలా.. కాంగ్రెస్ ఇచ్చే మూడు గంటల కరెంట్ కావాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Errabelli Dayakar Rao Sensational Comments On Congress Party: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీపై తాజాగా విమర్శలు గుప్పించారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఎప్పుడూ రైతులను పట్టించుకోలేదని ఆరోపించారు. అసలు రైతులపై కాంగ్రెస్ పార్టీకి కనికరం లేదన్నారు. ఉచిత విద్యుత్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. కేటీఆర్ పిలుపుమేరకు పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్స్లో రైతులు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ఇచ్చే మూడు పంటలు కావాలా? కాంగ్రెస్ ఇచ్చే మూడు గంటల కరెంట్ కావాలా? అని రైతుల్ని ఉద్దేశించి ప్రశ్నించారు. మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్ది అని కొనియాడారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ అని.. ఆయన రైతు బంధవుడని కొనియాడారు.
CPI Narayana: పవన్ ఓ రాజకీయ బ్రోకర్.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
అంతకుముందు కూడా.. ఒకప్పుడు కరెంటు కష్టాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమంటూ మంత్రి ఎర్రబెల్లి ధ్వజమెత్తారు. అసమర్థ, దుష్ట పాలన వల్ల రైతులు అరిగోస పడ్డారని.. అందుకే ఆ పార్టీకి ప్రజలు చరమగీతం పాడారని పేర్కొన్నారు. అయినా ఆ పార్టీకి బుద్ధి రాలేదని.. రేవంత్ రెడ్డి సిగ్గులేకుండా వ్యవసాయానికి కేవలం 3 గంటల కరెంట్ చాలని చెప్పాడని మండిపడ్డారు. వ్యవసాయం గురించి తెలిసినోడు అలాంటి మాటలు మాట్లాడుతారా? అని నిలదీశారు. కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలతో రైతులు నవ్వుకుంటున్నారని, నవ్వులపాలైన ఆ పార్టీని పాతాళంలో పాతి పెట్టాలని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ మూర్ఖంగా మాట్లాడుతోందని.. తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్ని అయోమయానికి గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దున్నపోతు ఈనిందంటే, దొడ్లో కట్టేయమన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి ఉందని మంత్రి ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు.
WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్.. కొత్త నెంబర్ సేవ్ చేయకుండానే చాట్ చేసే ఛాన్స్
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!