Errabelli Dayakar Rao: బిఆర్ఎస్ ఇచ్చే మూడు పంటలు కావాలా.. కాంగ్రెస్ ఇచ్చే మూడు గంటల కరెంట్ కావాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Errabelli Dayakar Rao Sensational Comments On Congress Party: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీపై తాజాగా విమర్శలు గుప్పించారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఎప్పుడూ రైతులను పట్టించుకోలేదని ఆరోపించారు. అసలు రైతులపై కాంగ్రెస్ పార్టీకి కనికరం లేదన్నారు. ఉచిత విద్యుత్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. కేటీఆర్ పిలుపుమేరకు పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్స్లో రైతులు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ఇచ్చే మూడు పంటలు కావాలా? కాంగ్రెస్ ఇచ్చే మూడు గంటల కరెంట్ కావాలా? అని రైతుల్ని ఉద్దేశించి ప్రశ్నించారు. మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్ది అని కొనియాడారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ అని.. ఆయన రైతు బంధవుడని కొనియాడారు.
CPI Narayana: పవన్ ఓ రాజకీయ బ్రోకర్.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Ponguleti Srinivas Reddy : 22ఏ భూములపై మంత్రి పొంగులేటి బిగ్ క్లారిటీ
- N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్పై బీజేపీ చీఫ్ ఫైర్
- TPCC: సీఎం రేవంత్రెడ్డితో మల్లు రవి భేటీ.. కొండా సురేఖ ఎపిసోడ్పై మీనాక్షి నటరాజన్, పీసీసీకి నివేదిక..
- Sangareddy: ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్తో తానూ ఆత్మహత్య
అంతకుముందు కూడా.. ఒకప్పుడు కరెంటు కష్టాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమంటూ మంత్రి ఎర్రబెల్లి ధ్వజమెత్తారు. అసమర్థ, దుష్ట పాలన వల్ల రైతులు అరిగోస పడ్డారని.. అందుకే ఆ పార్టీకి ప్రజలు చరమగీతం పాడారని పేర్కొన్నారు. అయినా ఆ పార్టీకి బుద్ధి రాలేదని.. రేవంత్ రెడ్డి సిగ్గులేకుండా వ్యవసాయానికి కేవలం 3 గంటల కరెంట్ చాలని చెప్పాడని మండిపడ్డారు. వ్యవసాయం గురించి తెలిసినోడు అలాంటి మాటలు మాట్లాడుతారా? అని నిలదీశారు. కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలతో రైతులు నవ్వుకుంటున్నారని, నవ్వులపాలైన ఆ పార్టీని పాతాళంలో పాతి పెట్టాలని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ మూర్ఖంగా మాట్లాడుతోందని.. తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్ని అయోమయానికి గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దున్నపోతు ఈనిందంటే, దొడ్లో కట్టేయమన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి ఉందని మంత్రి ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు.
WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్.. కొత్త నెంబర్ సేవ్ చేయకుండానే చాట్ చేసే ఛాన్స్
తాజావార్తలు
-
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్పైనే!
-
Yashasvi Jaiswal-ICC: శ్రీలంక పేసర్తో గొడవ.. యశస్వి జైస్వాల్కు ఐసీసీ బిగ్ షాక్!
-
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
-
Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
-
Raaka: ‘రాకా’లో ఐదో బ్యూటీ.. అట్లీ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!