Site icon NTV Telugu

Errabelli Dayakar Rao : మోడీ మేడారం ఎందుకు రాలేదు..

తెలంగాణలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు ఒకరిపైఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ.. మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వని వారు ఇక్కడ రాజకీయ లు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ ఏం మాట్లాడుతూన్నారో తెలియదని, అమ్మ సన్నిధిలో పార్టీల మధ్య చిచ్చు పెడుతున్నారన ఆయన విమర్శించారు. ఎడేల్లు గా పాలన చేస్తున్న మోది మేడారం జాతరకు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు.

ప్రతి గుడికి వెళ్లే ప్రధాని ఆదివాసీల జాతర కు ఎందుకు రారని ఆయన అన్నారు. అంతేకాకుండా మేడారం జాతరకు జాతీయ హోదా తేలేని కిషన్ రెడ్డికి మాట్లాడే హక్కు లేదన్నారు. కుంభమేళాకు 320 కోట్లు కేటాయించి మేడారం జాతరకు 2 కోట్లు కేటాయిస్తారా.. ఆదివాసీల పట్ల వివక్ష చూపుతున్న పార్టీ బీజేప అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. బీజేపీ వైఖరి మార్చుకోక పోతే రానున్న రోజుల్లో ఉరికించి కొట్టే రోజులు త్వరలోనే వస్తాయని ఆయన హెచ్చరించారు.

Exit mobile version