Ponguleti: సత్తుపల్లి నాదే.. కచ్చితంగా మూడు రంగుల జెండా ఎగరాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti: సత్తుపల్లి నా స్వంత నియోజకవర్గమని.. సత్తుపల్లిలో ఖచ్చితంగా మూడు రంగుల జెండా ఎగరాలని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్లయు చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో సత్తుపల్లి కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి భేటీ అయ్యారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని అన్నారు. టిక్కెట్ ప్రకటించక ముందు వేరు టిక్కెట్ ప్రకటించిన తరువాత వేరన్నారు సత్తుపల్లి నా స్వంత నియోజకవర్గమన్నారు. సత్తుపల్లి లో ఖచ్చితంగా మూడు రంగుల జెండా ఎగరాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అందురు కలిసి కట్టుగా పనిచేసి మట్టా రాగమయి ని గెలిపించాలని కోరారు. పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా నేను తుమ్మల కలిసి పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. సత్తుపల్లిలో భారీ మెజారిటీతో కాంగ్రెస్ గెలుపు కు అందరు కృషి చేయ్యాలని కోరారు.
పదేళ్లలో రూ.లక్ష కోట్లు దోచుకుని మూడోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని, ఆయనను ఓడించేందుకు కేసీఆర్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని, దీని కింద స్థానిక ఎమ్మెల్యేకు రూ.200 కోట్లు పంపించారన్నారు. తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో పొంగులేటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. BRS ద్వారా పంపిణీ చేయబడిన డబ్బు మీదే అన్నారు. మీ నుండి దోచుకున్న డబ్బులో కొంత మీకు తిరిగి ఇస్తున్నారని తెలిపారు. వాటిని తీసుకెళ్లి మీ మనసులో ఉన్న హస్తముద్ర ప్రకారం ఓటు వేయండి అని పొంగులేటి అన్నారు. పదవులు ఉన్నా, లేని వారి మధ్య ఉన్న శీనన్న కావాలా.. లేక పదవులు ఉన్నా ఏమీ చేయలేని వారి మధ్య ఉన్న శీనన్న కావాలో తేల్చుకోవాలని సూచించారు. ఇందిరమ్మ రాజ్యం ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. కొందరు నాయకులు తిరుమలాయపాలెం మండలాన్ని దత్తత తీసుకోవాలని కోరుతున్నారని, అయితే తిరుమలాయపాలెం మాత్రమే కాకుండా పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసేందుకు నడుచుకుంటానని హామీ ఇచ్చారు. అంతకుముందు పొంగులేటి సమక్షంలో జనసేన పార్టీ పాలేరు నియోజకవర్గ సమన్వయకర్త సురభి సూరజ్ కిరణ్ జనసేన కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్లో చేరారు.
Election Commission: తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు షాక్.. ప్రకటనలు నిలిపివేసిన ఈసీ
Also Read
- CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులకు శ్రీకారం.. సీఎం కీలక నిర్ణయాలు.!
- Ramchander Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.. బీజేపీ అధ్యక్షుడు ఫైర్.!
- Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. నేడు నాంపల్లి కోర్టు విచారణ.!
- Fire Accident: నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్ని ప్రమాదం
తాజావార్తలు
-
US-Iran: మరోసారి ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ చర్చలు.. ఎప్పుడంటే..!
-
Allu Arjun-Atlee: అల్లు అర్జున్ కీలక నిర్ణయం.. డైరెక్టర్ అట్లీకి డెడ్లైన్?
-
CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులకు శ్రీకారం.. సీఎం కీలక నిర్ణయాలు.!
-
Aditya Dhar: ‘నువ్వు నా నటుడివి కాదు.. నా బ్రదర్వి’: రణ్వీర్ సింగ్పై ‘ధురంధర్’ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్!
-
Polavaram Agency: ఏజెన్సీలో ఇంకా డోలీ మోతలే.. 4 కొండలు దాటి బాలికను మోసుకెళ్లిన గిరిజనులు
ట్రెండింగ్
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!