MLA Laxmareddy: మాయమాటలు చెప్పే కాంగ్రెస్ మాకు వద్దు.. లక్ష్మన్నతోనే గ్రామ అభివృద్ధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Laxmareddy: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కిష్టారం గ్రామంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభివృద్ధి పనులను ప్రజలకు చెబుతూ ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో కిష్టారం గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలను ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వారికి వివరించాలని తెలిపారు. మంచి చేసే ప్రభుత్వని వదులుకోవద్దు అని ప్రజలకు తెలియచేయాలని సూచించారు. వివిధ పార్టీలకు, సంఘాలకు, కులాలకు చెందిన నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకే మా మద్దతు అంటూ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. పోలేపల్లి గ్రామానికి చెందిన 50 మందికి పైగా కురుమలు గులాబీ కండువా కప్పుకున్నారు.
అదేవిధంగా ఉదండాపూర్ యూత్ ప్రెసిడెంట్ విజేందర్, జడ్చర్ల మున్సిపాలిటీ 17వ వార్డు శాంతినగర్ కు చెందిన 40 మంది కారెక్కారు. ఈ సందర్భంగా వారందరికీ ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎలక్షన్ అప్పుడు వచ్చి ఉచిత హామీలను ఇచ్చే నాయకులను నమ్మొద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి 11 సార్లు అధికారం ఇస్తే కనీస అవసరాలు అయినా నీళ్లు కరెంటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ను నమ్మి పొరపాటున ఓటేస్తే మళ్లీ చీకటి రోజులు తప్పవని స్పష్టం చేశారు. తాగునీటికి ఇబ్బందులు మళ్లీ ప్రజలకు ఎదుర్కొన వలసి వస్తుందని అన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని మరింత పెంచుకొని ముందుకు సాగాలంటే అది కేసీఆర్ తోనే సాధ్యమని కారు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. కాగా కిష్టారం గ్రామస్తులు మాట్లాడుతూ.. కిష్టారం గ్రామంలో కాంగ్రెస్ ఖేల్ ఖతం దుకాణం బంద్ అన్నారు. మాయమాటలు చెప్పే కాంగ్రెస్ మాకు వద్దని అన్నారు. లక్ష్మన్న హయాంలోనే మా గ్రామ అభివృద్ధి చెందుతుందని అన్నారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాసులు, సుధాకర్, మహేష్, ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
IND vs NZ Toss: భారత్ టాస్ గెలిస్తే.. రోహిత్ శర్మకు సన్నీ సలహా ఇదే!
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!