MLA Lakshmareddy: లక్ష్మారెడ్డిని లక్షమెజార్టీతో గెలిపిస్తాం.. మిన్నంటిన సబ్బండ వర్గాల తీర్మానం
MLA Lakshmareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నవాబుపేట మండలం అమ్మాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి జడ్చర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలను ఆరా తీస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంతటి అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్న కేసీఆర్ సర్కార్ కి మద్దతు తెలుపాలని కోరారు. రేపు నవంబర్ 30వ తేదినా జరుగబోయే ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని లక్ష మెజారిటీ తో గెలిపించాలని లక్ష్మారెడ్డి ప్రజలను కోరారు. ప్రచారంలో భాగంగా.. జడ్చర్ల నియోజకవర్గంలోని సబండవర్గాలు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వెంటే ఉంటామంటూ.. కారుగుర్తుకే ఓటేస్తామని ఆయా సంఘలా ఆధ్వర్యంలో తీర్మానాలు చేస్తున్నారు.

Also Read
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
- Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
ఇప్పటికే జడ్చర్ల లోని ఆర్యవైశ్య సంఘం, స్వర్ణకారుల సంఘం మరియు బిలియన్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపగా నిన్న మిడ్జిల్, ఉరుకొండ మండలాల ఆర్యవైశ్య సంఘం నాయకులు కూడా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి వెంటే ఉంటామంటూ తీర్మానం చేశారు. గత తొమ్మిదేళ్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాయని వివిధ రకాల వ్యాపార వర్గాలు కూడా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నామని తెలిపారు. మంచి చేసిన ప్రభుత్వానికి మామద్దతు ఉంటుందని లక్ష్మారెడ్డిని లక్షమెజార్టీతో గెలిపించే దిశగా తామంతా కృషి చేస్తామని తీర్మానం చేస్తున్నారు.

కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 150 మంది నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు చంద్రప్రకాష్ రెడ్డి, రామకృష్ణరెడ్డి, సిద్ధిరాంరెడ్డి, ఆంజనేయులు.. కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకి చెందిన నాయకులందరికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి అమ్మాపూర్ గ్రామం తరుపున పూర్తి మద్దతునిస్తూ కారుగుర్తుకు ఓటువేసి లక్షఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఇక మరోవైపు బాలానగర్ మండలం చింతకుంట తండాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తండాకు చెందిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు రవీందర్, వార్డు సభ్యులు రాజేశ్వరి, శ్రీనివాస్, రమేష్ సహా 100 మంది నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. నూతనంగా చేరిన వారందరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతన సభ్యులు మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి పూర్తి మద్దతునిస్తూ కారు గుర్తుకు ఓటువేసి లక్షఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
Medigadda Barrage: మేడగడ్డకు కిషన్ రెడ్డి, ఈటల.. హెలికాప్టర్ ద్వారా బ్యారేజీ పరిశీలన
తాజావార్తలు
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో