Medigadda Barrage: మేడగడ్డకు కిషన్ రెడ్డి, ఈటల.. హెలికాప్టర్ ద్వారా బ్యారేజీ పరిశీలన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medigadda Barrage: కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బ్యారేజీ పిల్లర్ల కుంగిపోవడంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక సంచలనం కావడం.. కొంత రాజకీయ విమర్శలకు దారితీస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మేడిగడ్డ పర్యటనకు రాజకీయ పార్టీలు క్యూ కట్టడంతో ఎక్కడా ఉద్రిక్తత చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బ్యారేజీని పరిశీలించగా, తాజాగా బీజేపీ నేతలు బ్యారేజీని సందర్శించేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్ శనివారం బ్యారేజీ వద్దకు వెళ్లనున్నారు. హెలికాప్టర్లో బ్యారేజీని పరిశీలించే అవకాశం ఉంది. మేడిగడ్డతో పాటు అన్నారం (సరస్వతి) బ్యారేజీని కూడా సందర్శించనున్నారు.
మేడిగడ్డ బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రాహుల్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు బ్యారేజీ వైపు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో బ్యారేజీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బ్యారేజీ వైపు ఎవరూ వెళ్లకుండా ఇనుప రేకులు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అధికారులు, సిబ్బందికి మాత్రమే ప్రయాణానికి అనుమతి ఉంది.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
- US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
బ్యారేజీ ఏడో బ్లాక్ 20వ పైర్ కుప్పకూలడం, దెబ్బతినడంతో సరిహద్దులో అక్టోబర్ 21 నుంచి తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్ర జలవిద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నిపుణుల కమిటీ అక్టోబర్ 24న బ్యారేజీని సందర్శించింది. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను తెలంగాణ ప్రభుత్వం నుండి కోరింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం పూర్తి వివరాలు ఇవ్వకపోవడంతో ఆ కమిటీ తన తాజా నివేదికను విడుదల చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ పైర్లు ప్లానింగ్, డిజైన్, నిర్మాణ నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ లోపాల వల్లే కూలిపోయిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డిఎస్ఎ) ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ తేల్చింది. బ్లాక్ నంబర్ 7లో ప్రతికూల పరిస్థితుల వల్ల బ్యారేజీ పనితీరుపై తీవ్ర ప్రభావం పడిందని, ప్రస్తుత పరిస్థితుల్లో అది నిరుపయోగంగా ఉందని స్పష్టం చేశారు.
Ira Khan-Nupur Shikhare: ప్రారంభమైన అమీర్ ఖాన్ కుమార్తె ఇరా, నుపుర్ శిఖరేల ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్
తాజావార్తలు
-
NTR Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ క్రేజీ అప్డేట్.. ఫ్లాష్బ్యాక్లో ఊహించని ట్విస్ట్!
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..