Medigadda Barrage: మేడగడ్డకు కిషన్ రెడ్డి, ఈటల.. హెలికాప్టర్ ద్వారా బ్యారేజీ పరిశీలన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medigadda Barrage: కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బ్యారేజీ పిల్లర్ల కుంగిపోవడంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక సంచలనం కావడం.. కొంత రాజకీయ విమర్శలకు దారితీస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మేడిగడ్డ పర్యటనకు రాజకీయ పార్టీలు క్యూ కట్టడంతో ఎక్కడా ఉద్రిక్తత చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బ్యారేజీని పరిశీలించగా, తాజాగా బీజేపీ నేతలు బ్యారేజీని సందర్శించేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్ శనివారం బ్యారేజీ వద్దకు వెళ్లనున్నారు. హెలికాప్టర్లో బ్యారేజీని పరిశీలించే అవకాశం ఉంది. మేడిగడ్డతో పాటు అన్నారం (సరస్వతి) బ్యారేజీని కూడా సందర్శించనున్నారు.
మేడిగడ్డ బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రాహుల్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు బ్యారేజీ వైపు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో బ్యారేజీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బ్యారేజీ వైపు ఎవరూ వెళ్లకుండా ఇనుప రేకులు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అధికారులు, సిబ్బందికి మాత్రమే ప్రయాణానికి అనుమతి ఉంది.
Also Read
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
బ్యారేజీ ఏడో బ్లాక్ 20వ పైర్ కుప్పకూలడం, దెబ్బతినడంతో సరిహద్దులో అక్టోబర్ 21 నుంచి తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్ర జలవిద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నిపుణుల కమిటీ అక్టోబర్ 24న బ్యారేజీని సందర్శించింది. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను తెలంగాణ ప్రభుత్వం నుండి కోరింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం పూర్తి వివరాలు ఇవ్వకపోవడంతో ఆ కమిటీ తన తాజా నివేదికను విడుదల చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ పైర్లు ప్లానింగ్, డిజైన్, నిర్మాణ నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ లోపాల వల్లే కూలిపోయిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డిఎస్ఎ) ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ తేల్చింది. బ్లాక్ నంబర్ 7లో ప్రతికూల పరిస్థితుల వల్ల బ్యారేజీ పనితీరుపై తీవ్ర ప్రభావం పడిందని, ప్రస్తుత పరిస్థితుల్లో అది నిరుపయోగంగా ఉందని స్పష్టం చేశారు.
Ira Khan-Nupur Shikhare: ప్రారంభమైన అమీర్ ఖాన్ కుమార్తె ఇరా, నుపుర్ శిఖరేల ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్
తాజావార్తలు
-
Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..