తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా రేపటి నుంచి అంటే అక్టోబర్ 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలువులు ఇచ్చినట్టు ప్రకటించింది ప్రభుత్వం.. ఇక, ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు జూనియర్ కళాశాలలకు దసరా సెలవులు ఉంటాయని వెల్లడించింది… దసరా సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించ వద్దని అన్ని జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది.. ఈ ఆదేశాలను పట్టించుకోపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.. కాగా, కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన విద్యాసంస్థలు.. దాదాపు 18 నెలల తర్వాత తిరిగి తెరుచుకున్న సంగతి తెలిసిందే.. కోవిడ్ సమయంలో అంతా ఆన్లైన్కే పరిమితం కాగా.. ఈ మధ్యే భౌతికతరగతులు ప్రారంభం అయిన విషయం విదితమే.