NTV Telugu Site icon

K. Laxman: మోకాళ్ళ యాత్ర చేసిన తెలంగాణ ప్రజలు నమ్మరు.. కేసీఆర్‌ పై లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు

Lakshman

Lakshman

K. Laxman: మోకాళ్ళ యాత్ర చేసిన తెలంగాణ ప్రజలు నమ్మరని మాజీ సీఎం కేసీఆర్‌ పై బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తుందన్నారు. అన్ని పార్టీల కన్నా ముందుగా దూసుకుపోతుందన్నారు. అభ్యర్థులు ఓటర్లను కలవడంలో ముందున్నారని తెలిపారు. రాజ్ నాథ్ సింగ్ తెలంగాణలో బీజేపీకి 12 సీట్లు వస్తాయని అన్నారు. ఈ రోజు కాంగ్రెస్, బీఆర్ఎస్ జీర్ణించుకోలేక.. పత్రికల్లో శీర్షికల కోసం మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనే రేవంత్ రెడ్డి హై టెన్షన్ లైన్ అవుతా అని అంటున్నారని తెలిపారు. ఎవరు కుట్రలు పన్నుతున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు.

Read also: Cold Water: వేసవిలో చల్లటి నీటితో స్నానం చేస్తే..

కేసీఆర్ మీరు మోకాళ్ళ యాత్ర చేసిన తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. మీ దురాగతాలను భరించలేక నే ఒడగొట్టారు… కాంగ్రెస్ లాభ పడ్డాయన్నారు. ప్రతిపక్షంగానే కాంగ్రెస్ విఫలం అయిందన్నారు. కాంగ్రెస్ కు గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు కూడా రావన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు ఏకం అయిన బీజేపీ నీ ఓడించలేరన్నారు. దేశంలో లేని కాంగ్రెస్ తెలంగాణలో కూడా లేకుండా పోతుందన్నారు. వికసిత తెలంగాణ పేరుతో ఒక సంకల్ప పత్రం త్వరలోనే విడుదల చేస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ డూప్ ఫైటింగ్ చేసుకుంటున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ విపక్ష కూటమిలో చేరుతుందన్నారు.
DK Aruna: ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్.. రేవంత్ రెడ్డి పై డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు