Site icon NTV Telugu

Jagadish Reddy: వెల్ వేటెడ్ కారిడార్ ఎక్కడ..?

Minister Jagadish Reddy

Minister Jagadish Reddy

ప్రధాని మోడిప్రసంగంపై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఫైర్ అమ్యారు. వెల్ వేటెడ్ కారిడార్ ఎక్కడ ఉందో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. డబుల్ ఇంజిన్ వస్తుంది.. కానీ అది కేసీఆర్ నేతృత్వంలో వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. మోడీ మాటల్లో అన్ని అబద్ధాలే అని మండిప‌డ్డారు. వెల్ వేటెడ్ కారిడార్ ఎక్కడ ఉందో చెప్పాలని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. రోడ్లకు నిధులిచ్చింది లేదు.. విదిలిచ్చింది లేదంటూ ఎద్దేవ చేసారు. సిగ్నల్ ఫ్రీ సహచర మంత్రి కేటీఆర్ చొరవతోటే అని గుర్తు చేసారు. సిగ్నల్ ఫ్రీ ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని, అమలు పరిచిన ఘనత మంత్రి కేటీఆర్ దే అని పేర్కొన్నారు. ఇప్పటికే 46 చోట్ల సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ అమలులో ఉందని తెలిపారు.

read also: Mahesh-Prashanth Neel: మహేశ్, ప్రశాంత్ నీల్.. మధ్యలో లోకేశ్ కనకరాజ్

ఇందులో కేంద్రం పాత్ర ఉందనడం అబద్దమే న‌ని మండిప‌డ్డారు. 50 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్న ఏకైక రాష్ట్రం మ‌న‌దే అంటూ హ‌ర్షం వ్య‌క్తం చేసారు. తెలంగాణ కంటే ఉత్తరప్రదేశ్ మూడింతలు పెద్దదని, మధ్యప్రదేశ్ రెండింతలు పెద్దదని.. అక్కడ ప్రభుత్వాలు సంక్షేమ రంగానికి ఖర్చు పెడుతుంది ఎంత? అంటూ ప్ర‌శ్నించారు జ‌గ‌దీష్ రెడ్డి. 2014 కు ముందు వెనుక అన్నది అధ్యయనం చేస్తేనే అభివృద్ధి గురించి తెలుస్తోందని విమ‌ర్శించారు. విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు తెలంగాణ అభివృద్ధికి ప్రతీకలని అన్నారు. ఆ విజయాల వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత ఉందని గుర్తు చేసారు జ‌గ‌దీష్ రెడ్డి.

Alluri Sitarama Raju: భీమవరంలో అల్లూరి విగ్రహం ప్రత్యేకతలు తెలుసా?

Exit mobile version