KTR: వార్నింగ్.. చిల్లరమల్లరగా మాట్లాడితే ఊరుకోనే ప్రసక్తి లేదు.. మా వాణి కూడా వినిపిస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిల్లరమల్లరగా మాట్లాడితే ఊరుకోనే ప్రసక్తి లేదు.. మా వాణి కూడా వినిపిస్తామని మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో రూ.2.50 కోట్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక పిల్లల సంరక్ష ణ విభాగంతోపాటు పలు విభాగాలను శుక్రవారం కేటీఆర్ ప్రారంభించారు. బీసీ స్టడీ సర్కిల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ‘కేంద్రానికి పన్నుల రూపం లో తెలంగాణ ఇచ్చిందే ఎక్కువ. తెలంగాణకు కేంద్రం నుంచి వ చ్చింది తక్కువ. దేశంలోని వెనకబడిన రాష్ట్రాలకు తెలంగాణ చెమట, రక్తం ఉపయోగపడుతున్నందుకు సంతోషపడుతున్నామని తెలిపిన కేటీఆర్.. కొందరు ఇక్కడికొచ్చి చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఇవ్వనివి ఇచ్చినట్లు చెబుతున్నారు. విమర్శలు చేస్తే పర్లేదు కానీ.. రాజకీయ భావదారిద్య్రంతో మాట్లాడితే ఊరుకోం. వారందరికి మావాణి వినిపించాల్సి వుంటుందని మండిపడ్డారు. తాజాగా నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ విభాగంలో దేశంలోనే మొదటి ర్యాంకు.. జనరల్లో రెండో ర్యాంకు సాధించడం గర్వకారణమని తెలిపారు.
కాగా.. స్వచ్ఛ సర్వేక్షణ్లో 12 మున్సిపాలిటీలతోపాటు 10గ్రామాలు.. 19 పంచాయతీలు అవార్డులు అందుకోవడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. అయితే.. ఆర్థికాభివృద్ధిలోనూ తెలంగాణ 4వ స్థానంలో ఉందని వెల్లడించారు. అయితే.. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, కర్ణాటకసహా పలురాష్ట్రాలకు తెలంగాణ నుంచి నిధులు వెళ్తేనే పనులు జరిగే పరిస్థితి ఉందన్నారు. దీంతో.. భారత జాతి నిర్మాణానికి తెలంగాణ దోహదపడుతుంటే ఇక్కడ కొంతమంది మిడిమిడి జ్ఞానంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ చేపట్టిన పల్లె గోస- జనం గోస యాత్ర పై మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా పల్లె గోస పడడం లేదని, జనం గోస అసలే లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు చైతన్య వంతులని.. నోటితో నవ్వుతూ.. నొసటితో వెక్కిరించేవారిని నమ్మరని కేటీఆర్ ఎద్దేవ చేసారు. బీజేపీ మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించవచ్చని అనుకుంటున్న వారే అమాయకులుగా మిగిలిపోతారన్నారని విమర్శించారు కేటీఆర్.
Also Read
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
CJI Justice NV Ramana: మీడియా కంగారు కోర్టులను నడిపిస్తోంది.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఫైర్
తాజావార్తలు
-
China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
-
Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
-
Pakistan Restores Historic Hindu Names : పాకిస్తాన్ ‘హిందూ’ జపం.!
-
CJP: ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి ఫాలోవర్లు పెరగడానికి కారణం ఇదేనా.. పలు అనుమానాలు..
-
Mahanadu : ‘స్త్రీ శక్తి’ థీమ్తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!