Telangana:ఓయూ విద్యార్థులు బీ..అలర్ట్.. పరీక్షలు వాయిదా..
ఉస్మానియ యూనివర్సీలో డిస్టేన్స్ ఎడ్యుకేషన్ చేస్తున్న విద్యార్థుకుల కీలక ప్రకటన చేసింది ఓయూ. ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ) ద్వారా అందించే అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
బీఏ, బీకామ్, బీబీఏ తదితర కోర్సుల పరీక్షలను ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించినప్పటికీ, ఈ పరీక్షలను 26వ తేదీ నుంచి నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రొఫెసర్ నగేశ్ చెప్పారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్న ప్రొఫెసర్ నగేశ్… ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు. అయితే ఇప్పటికే తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 23 నుంచి పదో తరగతి పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. పదో తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Also Read
అయితే .. 7 Jan 2022 న ఉస్మానియా, జేఎన్టీయూ వర్సిటీ పరీక్షలతో పాటు ఇగ్నో తదితర పరీక్షలు వాయిదా పడ్డాయి. దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో పలు పరీక్షలు వాయిదా పడనున్నాయి. ఈ జాబితాలోకి ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) కూడా చేరింది. వర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు IGNOU తాజాగా ప్రకటించింది. 2021 డిసెంబర్ కు(December) సంబంధించిన ఈ టర్మ్ ఎండ్ పరీక్షలు తదుపరి నోటీసు ఇచ్చేంతవరకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
ప్రస్తుతం వాయిదా పడిన ఇగ్నో టర్మ్ ఎండ్ పరీక్షలు(IGNOU TEE) 2022 జనవరి 20 నుంచి ఫిబ్రవరి 23 వరకు జరగాల్సి ఉంది. తాజాగా పరీక్షలు వాయిదా పడినే నేపథ్యంలో విద్యార్థులు ఎప్పటికప్పుడు ఇగ్నో అధికారిక వెబ్సైట్ http://ignou.ac.in/ చెక్ చేసుకుంటూ ఉండాలని సూచించింది.
తెలంగాణలో జనవరి 8 నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో జేఎన్టీయూ, ఓయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. జేఎన్టీయూ పరిధిలో జనవరి 10 – 12 మధ్య జరగాల్సిన బీటెక్, బీ ఫార్మసీ పరీక్షలు జనవరి 19 -21 మధ్య జరుగుతాయని వర్సిటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బీటెక్, బీ ఫార్మసీ 3, 4 సంవత్సరాల సప్లిమెంటరీ పరీక్షల రిజిస్ట్రేషన్ తేదీలను మార్చినట్లు వివరించారు.
ఇక ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జనవరి 8-16 మధ్య జరగాల్సిన అన్నీ పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తదుపరి పరీక్షలు జరుగు తేదీలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
Boris Johnson : వర్క్ ఫ్రం హోంపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Green Moong Dal Laddu: ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు బెల్లం లడ్డు.. పిల్లల కోసం అదిరిపోయే హెల్దీ స్నాక్.!
-
CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
-
Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
-
Senior Citizen FD: సీనియర్ సిటిజన్లకు FDలో అత్యధిక రాబడి.. ఏ బ్యాంకులు ఉత్తమం? పూర్తి వివరాలు
-
FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!