Adlur Laxman Kumar: ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు తప్పిన ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adlur Laxman Kumar: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాదానికి గురయ్యారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ఎమ్మెల్యేతోపాటు మరికొందరికి గాయాలయ్యాయి. అయితే గాయపడిన వారిలో ఎవరికీ ప్రాణహాని లేదని… వారందరికీ స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే…
Also Read
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ నిన్న (ఆదివారం) హైదరాబాద్ లో పని ముగించుకుని అర్థరాత్రి తన నియోజకవర్గానికి బయలుదేరారు. అతనితో పాటు మరికొందరు కూడా కారులో ఉన్నారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే కారు వెళ్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీని తప్పించబోయిన కారు అదుపు తప్పి బోల్తా పడింది. అర్ధరాత్రి 3.15 గంటలకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఎమ్మెల్యే కారు ప్రమాదం జరిగింది. కారు మంచి వేగంతో వెళ్తుండగా అదుపు తప్పి కారు ఎగిరి రోడ్డు పక్కన బోల్తా పడింది. కారులోని ఎయిర్బ్యాగ్ వెంటనే తెరుచుకోవడంతో ఎమ్మెల్యే లక్ష్మణ్తో పాటు మరికొందరి ప్రాణాలు కాపాడబడ్డాయి.
లక్ష్మణ్ తలకు గాయాలు కావడంతో వెంటనే కరీంనగర్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి మెరుగ్గా ఉందని… స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పలువురు అధికారులు, పోలీసులు, ఎమ్మెల్యే అనుచరులు, కాంగ్రెస్ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారు. లక్ష్మణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తమ ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుసుకున్న ధర్మపురి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
ఆరు రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ నెల 13న నల్గొండలో కేసీఆర్ నిర్వహించని సభకు హాజరైన లాస్య నందిత తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. సభ ముగించుకుని హైదరాబాద్కు తిరిగి వస్తుండగా నార్కట్పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద ఆమె కారు ఆటోను ఢీకొట్టింది. కారు ముందుభాగం కుడివైపు బాగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత తలకు గాయమైంది. ప్రమాద సమయంలో కారులో లాస్య నందితతోపాటు ఆమె చెల్లెలు, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు.
Matka Movie : ‘మట్కా’ మూవీ ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన వరుణ్..
తాజావార్తలు
-
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
-
Kitchen Hacks: ఫ్రిజ్లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్గా ఉంటుంది!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!