రెండు రోజులుగా బెడ్స్ సమస్య తలెత్తుతుంది అని తెలంగాణా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మొదట్లో 40 శాతం బెడ్ అక్కుపెన్సి ఉందన్న ఆయన ఇప్పుడు 116 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ అందిస్తున్నామన్నారు. 1935 ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ అనుమతి ఇచ్చామని, వంద మందికి కరోనా వస్తే 80 శాతం మందికి ఎటువంటి లక్షణాలు లేవని అన్నారు. కేవలం 7 నుంచి 8 శాతం ఆస్పత్రిలో చేరుతున్నారని అయన అన్నారు. కరోనా పాజిటివ్ అనగానే అందరూ ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఉండదని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్, మందుల కొరత లేదని, ప్రభుత్వ ఆస్పత్రులకు రమ్మని కోరారు. రెమిడిసివిర్ ఇప్పటికి ఎక్సపరమెంట్ డ్రగ్ మాత్రమేనని, మందులు అతిగా వాడొద్దని అన్నారు. రెమిడిసివిర్ దివ్య ఔషధం కాదన్న ఆయన జూన్ వరకు కరోనా తో జాగ్రత్తగా ఉండాల్సిందేనని అన్నారు. పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి.. ప్రజలు అర్ధం చేసుకోవాలని అన్నారు. వైరస్ ను లాక్ డౌన్ చెయ్యాలి, పండుగలు వస్తాయి పోతాయి ప్రాణాలు పోతే రావన్నారు. ప్రజల ప్రాణాలు పోతుంటే, పబ్ లకు వెళ్లి డ్యాన్స్ లు చేయటం.. తాగటం అవసరమా ? ప్రజలు అర్ధం చేసుకోవాలని ఆయన అన్నారు.,