Hyderabad: కేబుల్ బ్రిడ్జి వద్ద కమాండ్ కంట్రోల్ వాచ్ టవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద కమాండ్ కంట్రోల్ వాచ్ టవర్, పెట్రోలింగ్ సిస్టమ్ను సైబరాబాద్ సీపీ స్టెఫెన్ రవీంద్రతో కలిసి డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రజల భ్రదత కోసమే తాము అనేక చర్యలు చేపడుతున్నామని డీజీపీ అన్నారు. హైదరాబాద్కు తలమానికమైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి రక్షణ కోసం 67 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. కమాండ్ కంట్రోల్కు ఈ కెమెరాల్ని అనుసంధానం చేశామని చెప్పిన ఆయన, ఈ కెమెరాల ఏర్పాటుకు రహేజా గ్రూప్ సహాయ సహకారాలు అందించిందన్నారు.
Read Also: Telangana: కేఆర్ఎంబీకి మరోలేఖ.. 50:50 నిష్పత్తిలో నీళ్లు..!
Also Read
దుర్గం చెరువును సందర్శించేందుకు వచ్చే విజిటర్స్ రక్షణ కోసమే ఈ వ్యవస్థని ఏర్పాటు చేశామని, అలాగే లేక్ పోలీసింగ్ కూడా ఉందని చెప్పారు. దుర్గంచెరువు గస్తీ కోసం ఎలక్ట్రికల్ వెహికల్స్, బోటింగ్ వంటి వాటిని నియమించామన్నారు. సైబరాబాద్ సేఫ్ అండ్ సెక్యూరిటీలో ఉందని, తెలంగాణలో ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఐటి ఏరియాల్లో రక్షణ బాగా ఉండడం వల్లే అనేక కంపెనీలు హైదరాబాద్కి తరలి వస్తున్నాయని చెప్పారు. ప్రజల రక్షణ పోలీస్ వ్యవస్థ మొదటి కర్తవ్యమని డీజీపీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
-
Ganja Racket : మెడిసిన్ పేరుతో గంజాయి.. పోస్టులో డోర్ డెలివరీ.!
-
Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
ట్రెండింగ్
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?