Hyderabad Murder: హైదరాబాద్లో మరో హత్య.. కాచిగూడ రైల్వే ఫ్లాట్ ఫామ్ పై మృతదేహం..
- హైదరాబాద్లో సంచలనంగా మారిన మరో హత్య..
- కాచిగూడ రైల్వే ప్లాట్ఫారమ్లో మృతదేహం లభ్యం..
- భయాందోళనకు గురైన స్థానికులు..
- ఇది హత్యకాదు పక్కా మర్డర్ అంటున్న కుటుంబసభ్యులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Murder: హైదరాబాద్లో మరో హత్య సంచలనంగా మారింది. కాచిగూడ రైల్వే ప్లాట్ఫారమ్లో మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్లాట్ ఫామ్ పై వున్న సిబ్బంది మృత దేహాన్ని చూసి షాక్ తిన్నారు. వెంటనే రైల్వే పోలీసులకు సమచారం ఇచ్చారు. దీంతో హుటా హుటిన రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం కిజార్ అనే వ్యక్తిగా గుర్తించారు. పాత నగరానికి చెందిన చుమ్మా చౌష్ మనవడుగా తెలిపారు పోలీసులు. కిజార్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. అయితే కిజార్ కుటుంబం ఘటనాస్థలికి చేరుకుని బోరున విలపించారు. తన కొడుకు ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరో చంపి రైల్వే ట్రాక్ పై పడేసి వెళ్లారని వాపోయారు. కిజార్ తండ్రి సోహెల్ మాట్లాడుతూ.. నా కొడుకు కిజార్ ఆత్మహత్య చేసుకునేంత పిరికి వ్యక్తి కాదని తెలిపాడు. ఇది ఆక్సిడెంట్ కాదని, ఇది పక్కా మర్డర్ అని తెలిపారు. ఉదయం 4.30 గంటలకు కిజార్ లేచి తన తల్లికి ఇప్పుడే వస్తా అని బయటకు వెళ్లాడని తెలిపారు. గంటకే పోన్ స్విచ్ ఆఫ్ రావడంతో భయాందోళన చెందామని తెలిపారు.
Read also: CM Chandrababu: రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన.. కూల్చిన ప్రజావేదిక నుంచే స్టార్ట్..!
Also Read
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. నా కొడుకు కిజార్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పడు నేను ఆఫీస్ లో వున్నానని తెలిపాడు. నాకు నా చిన్న కొడుకు కిజార్ గురించి సమాచారం ఇచ్చాడని అన్నారు. స్నేహితులని, బంధువును అడగాలని తెలుపగా.. అడిగినా సరైన సమాధానం లేదని చిన్న కొడుకు తెలిపాడు. కొందరు తెలిసిన వాళ్లు మాకు కాల్ చేసి కాచిగూడ వెళ్లాలని తెలుపడంతో మేమందరం అక్కడకు వెళ్లామని అన్నాడు. నా కొడుకు వస్తాడనే మేము వెతుకుతూనే వున్నామని పోలీసులకు సమాచారం ఇవ్వలేదని తండ్రి అన్నారు. తన కొడుకు మృతదేహం మహమ్మద్ నగర్ వద్ద మహమ్మదీయ మసీదు వద్ద నా కొడుకును మర్డర్ చేసి వుంటారని నా అనుమానం అన్నారు. ఇది ఆత్మహత్యగా పోలీసులు చిత్రీకరిస్తూ కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా కొడుకును ఎవరో చంపేసి కాచీగూడ రైల్వే ట్రాక్ పై పడేసి వుంటారని తెలిపారు. ఎందుకంటే తన తలపై, మోకాళ్లపై బలమైన గాయాలు ఉన్నాయని అన్నారు. తన తలను కూడా నరికేసి రైల్వే ట్రాక్ పై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తు్న్నట్లు తెలిపారు. దీనిపై పోలీసులు సరైన విచారణ జరపాలని వేడుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకుంటూ మోకాళ్ల వద్ద బలమైన గాయాలు వున్నాయని, మొఖంపై కంటి మీద కూడ గొడ్డలితో నరికి నట్లు వుందని అనుమానం వ్యక్తం చేశాడు. సరైన విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
US- Taiwan: తైవాన్కు అమెరికా నుంచి వెయ్యి సాయుధ డ్రోన్లు.. చైనాకు చెక్ పెట్టేందుకేనా?
తాజావార్తలు
-
Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
-
Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. ‘నా వ్యాఖ్యల్లో తప్పు లేదు’..!
-
Pakistan Minister: “చేతులు నరికేస్తాం”.. సింధు జలాల విషయంలో భారత్కు పాక్ మంత్రి వార్నింగ్!
-
Janhvi Kapoor: టాలీవుడ్ తర్వాత కోలీవుడ్పై ఫోకస్.. భారీ వెబ్ సిరీస్తో జాన్వీ కపూర్ డిజిటల్ ఎంట్రీ!
-
Vastu Tips: మనీ ప్లాంట్ను ఈ దిశలో పెడితే ధన యోగం వస్తుందా?.. వాస్తు నిపుణులు చెప్పే సూచనలు ఇవే
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!