Damodara Raja Narasimha : మహిళల ఆరోగ్యమే సమాజ అభివృద్ధికి పునాది
- ఆరోగ్యమహిళ క్లినిక్ల ద్వారా ఉచిత వైద్య పరీక్షలు, చికిత్సలు
- రాష్ట్రవ్యాప్తంగా మాతా-శిశు ఆరోగ్య కేంద్రాల విస్తరణ
- మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ ఎర్లీ డిటెక్షన్పై ప్రత్యేక దృష్టి
- సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక హెల్త్ క్యాంపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Damodara Raja Narasimha : రాష్ట్ర మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి మాట్లాడుతూ, మహిళల కోసం ప్రత్యేకంగా ఆరోగ్యమహిళ క్లినిక్స్ ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ క్లినిక్లలో అవసరమైన అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేయించడంతో పాటు, చికిత్స మరియు మెడిసిన్ కూడా అందజేస్తున్నామని వివరించారు.
ఉమ్మడి రాష్ట్రంలోనే 2012-13లో ప్రారంభమైన మాతా-శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి, గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సమగ్ర వైద్య సేవలు అందిస్తున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేన్సర్ కేసులు, ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న బ్రెస్ట్ కేన్సర్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, రాష్ట్రవ్యాప్తంగా డే కేర్ కేన్సర్ సెంటర్ల ద్వారా స్క్రీనింగ్, ఎర్లీ డిటెక్షన్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు. అలాగే ఎన్సీడీ క్లినిక్స్ ద్వారా బీపీ, షుగర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు, కేన్సర్ వంటి సమస్యలతో బాధపడుతున్న మహిళలకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
- OTR : మంత్రి శ్రీధర్బాబుతో ఎంపీ వంశీకి సెట్ అయిందా?
మహిళలతో పాటు ట్రాన్స్జెండర్ల కోసం మైత్రి క్లినిక్స్ కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్య రంగంలోనే కాకుండా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సంక్షేమ పథకాల అమలులో కూడా మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వస్థ్ నారీ సశక్త్ అభియాన్’ కార్యక్రమానికి మంత్రి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు మహిళల కోసం ప్రత్యేక హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సేవలను మహిళలు తప్పక వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..