Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cpiml Prajapantha Party Established In Yellandhu

CPI ML PrajaPantha: ఉనికి కోసం పోరాటం తప్పదా?

Published Date :February 22, 2022 , 8:27 pm
By newsdesk
CPI ML PrajaPantha: ఉనికి కోసం పోరాటం తప్పదా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రజా సమస్యల కోసం లీగల్ కేడర్ ఒకవైపు, అజ్ఞాత దళాలు మరొకవైపు కలిగివున్న బలమైన నక్సల్స్ పార్టీ సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ. ఇల్లందు నియోజక వర్గం దానికి పట్టుకొమ్మ. అలాంటి బలం కలిగిన న్యూ డెమోక్రసీ పార్టీ చీలికలు పీలికలుగా విడిపోయింది, అందులో నుండి మళ్లీ సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ప్రజాపంథా పేరుతో మరో నక్సలైట్ పార్టీ నూతనంగా ఆవిర్భవించింది.

న్యూ డెమోక్రసీ పార్టీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బలమైన కేంద్ర బిందువు. మొదట సీపీఐఐ ఎంఎల్ పార్టీగా ఇల్లందు నియోజకవర్గంలో ప్రజలకు పరిచయమై, ప్రజా సమస్యల కోసం పనిచేస్తున్న నేపథ్యంలోనే సిద్ధాంత విభేదాలతో 1984 -85 సంవత్సరంలో ఎమ్మెల్ పార్టీ రెండుగా విడిపోయింది. సిపిఐ ఎంఎల్ విమోచన పార్టీగా, సిపిఐ ఎంఎల్ ప్రజా పందా పార్టీగా విడిపోయాయి. విమోచన పార్టీకి చండ్ర పుల్లారెడ్డి నాయకత్వం వహించగా, ప్రజా పంథా పార్టీకి పైలా వాసుదేవరావు నాయకత్వం వహించారు. విమోచన పార్టీ జనశక్తిగా, ప్రజా ప్రతిఘటన గా అనేక చీలికలు పీలికలు గా విడిపోయి చివరికి ఉనికి లేకుండా పోయింది. ఇక పైలా వాసుదేవరావు నాయకత్వం వహిస్తున్న సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా పార్టీ అనతికాలంలోనే సిపిఐఎం ఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ గా పేరు మారింది.

న్యూ డెమోక్రసీ పార్టీ ఇల్లందు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే స్థానాన్ని ఏకధాటిగా ఐదుసార్లు గెలిపించుకుంది. ఈ పార్టీ 2013లో సిద్ధాంత పరమైన విభేదాలతో రాయల వర్గం, చంద్రన్న వర్గంగా చలామణీ అవుతున్నాయి. చంద్రన్న వర్గం కేంద్ర కమిటీని ఏర్పాటు చేసుకుంది. చంద్రన్న వర్గానికి కేంద్ర కమిటీ కార్యదర్శిగా పెద్ద చంద్రన్న బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. రాయల వర్గానికి కేంద్ర కమిటీ బాధ్యతలను యతీంద్ర కుమార్ నిర్వహిస్తున్నారు. ఈ రెండూ వర్గాలు న్యూ డెమోక్రసీ పార్టీ పేరుతోనే ఇల్లందు పట్టణంలో మండల కేంద్రాలలో వేరు కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. యతీంద్ర కుమార్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న న్యూ డెమోక్రసీ పార్టీలో కొంతమంది కేంద్ర కమిటీ విధానాలను వ్యతిరేకిస్తూ వస్తున్నది.

కమిటీ సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ అనుసరిస్తున్న పిడివాద విధానాలను అనుసరిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో మరో రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయడం, ఆ కమిటీ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి ఉద్యమాన్ని విచ్చిన్నం చేయడానికి పూనుకోవడం జరుగుతుందని భావించి కేంద్ర కమిటీ నుండి విడిపోవడం అనివార్యమయింది అని నూతనంగా ఆవిర్భవించిన ప్రజాపంథా పార్టీ నాయకులు ప్రకటన విడుదల చేశారు. రాయల వర్గానికి చెందిన పోటు రంగారావు కేంద్ర కమిటీలో ఉన్నారు. ఆయన బయటికి వచ్చి మరి కొంతమంది తో కలిసి ప్రజాపంథా పేరుతో పార్టీని నెలకొల్పారు. పోటు రంగారావు, రంగయ్య, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తదితరులతో నూతనంగా రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.

ఇల్లందు నియోజకవర్గంలో బలమైన నక్సలైట్ పార్టీగా ఉన్న న్యూ డెమోక్రసీ పార్టీ బలహీనపడుతూ వస్తోంది. ఎన్నికల్లో గెలిచిన ఈ పార్టీ వర్గాలుగా విడిపోవడం వలన అసెంబ్లీ ఎన్నికల్లో4వ స్థానానికి చేరుకుంది. న్యూ డెమోక్రసీ పార్టీ విడిపోవడం వలన ఇప్పటికే మెల్లమెల్లగా కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పుడు రాయల వర్గంలోని మరొక వర్గం ప్రజా పంథా పేరుతో వస్తున్న కొత్త సీసాలో పాత సారా అన్నట్టు, మారింది పేరు మాత్రమే, వ్యక్తులు మాత్రం వారే అవడం వలన ప్రజల సమస్యలపై ఎలాంటి పోరాటాలు చేయనున్నారో చూడాలి మరి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • chandranna vargam
  • cpi ml prajapantha
  • khammam
  • mavoist party
  • new party

తాజావార్తలు

  • Peddi : ఎప్పుడు వచ్చినా టెన్షన్ లేదు!

  • Rajnath Singh: ఈసారి పాకిస్తాన్ ఎన్ని ముక్కలు అవుతుందో దేవుడికే తెలియాలి..

  • 2BHK Rent: వామ్మో.. భారత్‌లోని ఈ నగరంలో డబుల్ బెడ్రూమ్ అద్దె రూ. 3 లక్షలు!

  • Krithi Shetty: చాలా కాలం తర్వాత ప్యూర్ లవ్ స్టోరీ చేస్తున్నా..

  • AP Liquor Case: ఏపీ లిక్కర్‌ కేసులో కీలక పరిణామం.. ఏ1 రాజ్‌ కేసిరెడ్డికి బెయిల్‌

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions