D Raja: బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి.. దేశాన్ని నాశనం చేస్తున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI D Raja Speech In Khammam BRS Public Meeting: బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా మండిపడ్డారు. వన్ పార్టీ వన్ లీడర్ విధానంతో బీజేపీ ముందుకెళ్తోందని.. మోడీ సర్కారు రాష్ట్రాల సమస్యలను పట్టించుకోకుండా, బడా బాబులకు రెడ్ కార్పెట్ పరుస్తోందని విమర్శించారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ఆ పార్టీని ఓడించడమే అందరి ముందున్న కర్తవ్యమని అన్నారు. దేశం అతిపెద్ద సంక్షోభంలో ఉందని, దేశానికి బీజేపీ ప్రమాదికారిగా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మన దేశం హిందూ దేశంగా మారితే ప్రమాదకరమని రాజ్యాంగ రూపకర్త బీఆర్ అంబేద్కర్ ఆనాడే హెచ్చరించారని.. ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపిస్తోందని చెప్పారు.
Bhagwant Mann Singh: బీజేపీ ఒక జుమ్లా పార్టీ.. లూటీతంత్రం నడిపిస్తోంది
Also Read
బీజేపీ, ఆర్ఎస్ఎస్ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని.. విద్య, ఆరోగ్యం, ఉద్యోగ అంశాలను కేంద్రం విస్మరిస్తోందని డీ రాజా ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ పేదలు, రైతుల పక్షాన లేరని.. కార్పొరేట్ శక్తులకు మాత్రమే ఆయన కొమ్ముకాస్తున్నారని.. అదానీ, అంబానీ, టాటాబిర్లా జపం చేస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థను బీజేపీ దుర్వినియోగం చేస్తుందని.. కేరళ, తమిళనాడు, తెలంగాణలో గవర్నర్లు హద్దుమీరుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను.. గవర్నర్లతో కేంద్రం ఇబ్బంది పెడుతోందన్నారు. రాజ్యాంగేతర శక్తిగా బీజేపీ మారుతోందన్నారు. బీజేపీ చెబుతున్నట్లు.. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఎక్కడుందని ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దేశ మౌలిక వ్యవస్థలనే మార్చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగాలని.. బీజేపీపై ఐక్య పోరాటానికి ఖమ్మం సభ నాంది కావాలని పిలుపునిచ్చారు.
Arvind Kejriwal: గవర్నర్లను మోడీ ఆడిస్తున్నారు.. బీజేపీని తరిమికొట్టాలి
ఇదే సమయంలో.. తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తోందని కేసీఆర్ సర్కార్పై డీ రాజా ప్రశంశల వర్షం కురిపించారు. కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. నిరంతర కరెంటు, శుభ్రమైన తాగునీరు అందుతున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని కొనియాడారు. రైతుబంధు, దళితబంధు పథకాలు ఆదర్శనీయమని.. రాబోయే రోజుల్లో కేసీఆర్ మరిన్ని మంచి పథకాలు తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం అందరూ కలిసి పోరాడితే తప్ప దేశాన్ని కాపాడుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు. సెక్యులర్ పార్టీలన్నీ కలిసి.. బీజేపీ నుంచి దేశానికి విముక్తి కలిగించాలని వెల్లడించారు.
తాజావార్తలు
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?