Bhagwant Mann Singh: బీజేపీ ఒక జుమ్లా పార్టీ.. లూటీతంత్రం నడిపిస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagwant Mann Singh Fires On BJP In BRS Party Meeting: ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ బీజేపీపై నిప్పులు చెరిచారు. బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ అని.. ఎమ్మెల్నేల్ని కొనాలి, అధికారంలోకి రావాలి అనేదే ఆ పార్టీ సూత్రమని విమర్శించారు. తొలుత ఆయన సభను ఉద్దేశించి.. సభకు వచ్చిన జనం చూస్తుంటే అద్భుతంగా ఉందన్నారు. ఏవైనా ప్రత్యేక కళ్లద్దాలు తయారు చేసి ఉంటే.. ఇంత జనాన్ని ఆ అద్దాల నుంచి చూసేవాడిని పేర్కొన్నారు. అనంతరం బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ.. ఈ దేశం రంగు రంగుల పూల సమాహారం అని, కానీ ఒకే పువ్వు ఉండాలని కొందరు చూస్తున్నారని కౌంటర్ వేశారు. ప్రతీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చారని.. కానీ అవి జుమ్లాలుగా నిలిచిపోయాయని అన్నారు.
Arvind Kejriwal: గవర్నర్లను మోడీ ఆడిస్తున్నారు.. బీజేపీని తరిమికొట్టాలి
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
విదేశాల్లో ఉన్న అవినీతి డబ్బుని దేశానికి తీసుకొచ్చి.. ప్రతి ఒక్కరి ఖాతాలోకి రూ.15 లక్షల ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చారని.. అది కూడా అబద్ధంగా నిలిచిపోయిందని భగవంత్ మాన్ సింగ్ విమర్శించారు. బీజేపీ అబద్ధాల పార్టీగా మారుతోందని.. ఎమ్మెల్యేలను కొనడం, ఉప ఎన్నికల్లో గెలవడం బీజేపీకి అలవాటుగా మారిందని అన్నారు. బీజేపీ నడిపిస్తోంది లోకతంత్రం కాదు.. లూటీతంత్రమని ఎద్దేవా చేశారు. అన్ని లూటీ చేయడమే బీజేపీ పని అని.. రైల్వే, ఎల్ఐసీ, ఎయిర్పోర్టులను అమ్మేసిందని అన్నారు. కేవలం మీడియాను మాత్రమే కొనుగోలు చేసి, అందులో తన సొంత డబ్బా కొట్టించుకుంటోందని సెటైర్ వేశారు. అన్ని తమకోసమే అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని.. అన్ని రాష్ట్రాల్ని ఆరాటపడుతోందని పేర్కొన్నారు. కానీ సమయం అన్నీ నేర్పుతుందని, రాజుల్ని కూడా అడుక్కునేలా చేస్తుందని బీజేపీకి హెచ్చరికలు జారీ చేశారు. కేజ్రీవాల్ స్కూళ్లపై విమర్శలు చేసిన బీజేపీ.. ట్రంప్ సతీమణి వచ్చినప్పుడు కేజ్రీవాల్ స్కూల్నే బీజేపీ చూపించిందని వ్యాఖ్యానించారు.
Akhilesh Yadav: బీజేపీ కౌంట్డౌన్ స్టార్ట్.. ఆ పార్టీని తరిమికొట్టండి
ఇక తెలంగాణ పథకాలపై ప్రశంజలు కురిపించిన భగవంత్ మాన్ సింగ్.. పంజాబ్లోనూ తెలంగాణ ప్రభుత్వం లాంటి పథకాలను ప్రవేశపెడుతామన్నారు. కంటి వెలుగు ఎంతో ప్రభావంతమైన పథకమని కొనియాడారు. మంచి పనులు చూసి నేర్చుకోవాలని.. ఇవి నాలెడ్జ్ షేరింగ్ రోజులని చెప్పారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంచి హృదయం ఉన్న నేతలు ఈ దేశంలో లేరని, ఉంటే దేశం సస్యశ్యామలం అవుతుందన్నారు.
Pinarayi Vijayan: రాజ్యాంగాన్ని కాపాడేందుకు.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!