Hyderabad: రంజాన్ మాసం.. చార్మినార్ వద్ద వ్యాపారులకు నగర సీపీ గుడ్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసాలలో రంజాన్ ఒకటి. ఇస్లాంలో ఈ నెల చాలా ముఖ్యమైనది. ముస్లింలు ఉపవాసాలు, ప్రార్థనలు, సామూహిక భోజనాలు చేస్తూ నెల రోజులు గడుపుతారు. రంజాన్ ముగింపు సందర్భంగా ఈద్ అల్-ఫితర్ జరుపుకుంటారు. అయితే రంజాన్ మాసమంతా రాత్రి వేళల్లో షాపులు తెరిచి ఉండటం ఆనవాతీ.. ఎందుకంటే రాత్రి ఒక్కపొద్దు ఉన్నవారు బయట హోటల్లో సహారీ(ఉదయం లేచి తినడం) చేస్తారు. అందువల్ల రాత్రంతా అంగల్లను తెరిచే ఉంచుతారు. కొందరు రాత్రుల్లు అంగల్లను తెరిచి ఉంచేందుకు అనుమతించడం లేదని చార్మిన్ వద్ద పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంజాన్ మాసంలోనే తమకు రాత్రిపూట గిరాకీ ఉంటుందని వాపోయారు. ఈనేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి ముస్లీంలకు శుభవార్త చెప్పారు. రంజాన్ మాసంలో రాత్రంతా వ్యాపారాలు కొనసాగించవచ్చని శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు.
Read also: Viral Photo: కరెన్సీ నోట్లపై నిద్రిస్తున్న నేత..!
Also Read
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాత్రి దక్షిణ మండలం డీసీపీ సాయిచైతన్యతో కలిసి పాతబస్తీలో పర్యటించారు. మదీనా నుంచి చార్మినార్ వరకు పాదయాత్ర చేస్తూ స్థానికులను మర్యాదపూర్వకంగా పలకరించారు. వ్యాపారాలు ఎలా సాగుతున్నాయని చిరు వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. కొందరికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మదీనా, పట్టరగట్టి, మీరాలమ్మండి, గుల్జార్హౌజ్, చార్కమాన్ మీదుగా చార్మినార్కు చేరుకుని దారిలో ట్రాఫిక్, శాంతి భద్రతలను పర్యవేక్షించారు. ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రంజాన్ మాసం ముగిసే వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా రాత్రంతా వ్యాపారాలు కొనసాగించవచ్చన్నారు. జేబు దొంగల పట్ల వినియోగదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పర్యాటకులకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మార్కెట్కు తగిన ఏర్పాట్లు చేశారు.
Viral Photo: కరెన్సీ నోట్లపై నిద్రిస్తున్న నేత..!
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!