కరోనా ప్రస్తుతం మన దేశాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా మనుషులను కర్కసంగా మారుస్తుంది. కొన్ని గ్రామంలో కరోనా సోకినా వారిని మరి దారుణంగా చూస్తున్నారు. రాజమ్మ సిరిసిల్ల జిల్లా వీరపల్లిలో పాజిటివ్ వచ్చిందని ఓ బాలికను ఊరి బయట ఉండాలని ఆదేశించారు. పొల్లాలో చిన్న కవర్ తో గుడిసె వేసి అక్కడే ఉంచారు. దాంతో ఆ బాలిక వర్షానికి తడుస్తూ.. ఎండకు ఎండుతూ… రాత్రంతా భయంభయం గా గడిపింది. అయితే ఈ విషయం తెలుసుకున్న అధికారులు బాలికను దగ్గరలోని ఐసోలేషన్ కేంద్రానికి మార్చారు. అయితే ఇప్పుడు ఆ గ్రామస్థుల తీరు పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.