నల్గొండ స్వత్రంత అభ్యర్థి నగేష్ ఎంపీ కోమటిరెడ్డిపై సంచలన కామెంట్లు చేసారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ని ప్రకటించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుగురు స్వత్రంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నాం. నేను కాంగ్రెస్ కి చెందిన జెడ్పీటీసీని… అయినా నాకు ఓటు వెయ్యవద్దని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఓటర్లకు చెప్పారు అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ కి సపోర్ట్ చేశారు. ఆయన వల్లే నాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నష్టం జరిగింది అన్నారు.
అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నిలబెట్టిన స్వతంత్ర అబ్యర్ధికి 26 ఓట్లు మాత్రమే వచ్చాయి. నిజాయితీగా ఉన్న నాకు 226 ఓట్లు వచ్చాయి అని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కి ఆయన అనుచరులకు కోటి రూపాయలు అందాయి. రాబోయే ఎన్నికల్లో ఎంపీ కోమటిరెడ్డి ఎస్సీ, ఎస్టి లు బుద్ధి చెపుతారు. టీఆర్ఎస్ పార్టీ లక్షల రూపాయలు ఇచ్చి ఈ ఎన్నికలో గెలిచింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కి ఎంపీ కోమటి రెడ్డి అమ్ముడు పోయారు అని పేర్కొన్నారు.