నవంబర్ 14 నుంచి 21 వరకు కాంగ్రెస్ నేతల పాదయాత్రలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో పాదయాత్రల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే బండి సంజయ్, ఈటెల రాజేందర్ వంటి కీలక నేతలు పాదయాత్రలు చేయగా.. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రస్తుతం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ నేతలు కూడా పాదయాత్రలు చేపట్టనున్నారు. తెలంగాణలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా 33 జిల్లాల్లో ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ వెల్లడించారు. ఈనెల 14 నుంచి 21 వరకు తెలంగాణ వ్యాప్తంగా 2,300 కిలోమీటర్లు మేర ప్రజాచైతన్య పాదయాత్ర చేయనున్నట్లు మధుయాష్కీ ప్రకటన చేశారు. రాష్ట్ర, జాతీయ సమస్యలపై ప్రజలను చైతన్యం చేయడం కోసం పాదయాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అంతకంటే ముందు ఈనెల 9 నుంచి డీసీసీ మండల, టౌన్ అధ్యక్షులతో శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు.
Read Also: అఖిలేష్ యాదవ్ సంచలన నిర్ణయం
Also Read
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
మరోవైపు ఏపీ, తెలంగాణను మళ్లీ కలుపుతారంటూ వస్తున్న వార్తలపై మధుయాష్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రను కలపాలని ఎవరూ మాట్లాడొద్దని హితవు పలికారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. అది సోనియా గాంధీ నిర్ణయంతో ఆవిష్కృతమైందని ఆయన తెలిపారు. అధికార దాహంతో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ, ఆంధ్రను కలపాలని కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రెండు రాష్ట్రాలను కలపాలని జగ్గారెడ్డి మాట్లాడటం ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. అది ఏ మాత్రం పార్టీ నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ఈ విషయంపై జగ్గారెడ్డిని వివరణ అడగ్గా.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాటిచ్చారని మధుయాష్కీ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు ఆకాంక్ష నెరవేరడం లేదనే విషయం జగ్గారెడ్డి అభిప్రాయమన్నారు. మరోవైపు తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు బాధ్యులు ఎవరని ప్రభుత్వాన్ని మధుయాష్కీ ప్రశ్నించారు. నిరుద్యోగుల సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేయాలని కోరారు.
తాజావార్తలు
-
Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!