నవంబర్ 14 నుంచి 21 వరకు కాంగ్రెస్ నేతల పాదయాత్రలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో పాదయాత్రల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే బండి సంజయ్, ఈటెల రాజేందర్ వంటి కీలక నేతలు పాదయాత్రలు చేయగా.. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రస్తుతం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ నేతలు కూడా పాదయాత్రలు చేపట్టనున్నారు. తెలంగాణలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా 33 జిల్లాల్లో ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ వెల్లడించారు. ఈనెల 14 నుంచి 21 వరకు తెలంగాణ వ్యాప్తంగా 2,300 కిలోమీటర్లు మేర ప్రజాచైతన్య పాదయాత్ర చేయనున్నట్లు మధుయాష్కీ ప్రకటన చేశారు. రాష్ట్ర, జాతీయ సమస్యలపై ప్రజలను చైతన్యం చేయడం కోసం పాదయాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అంతకంటే ముందు ఈనెల 9 నుంచి డీసీసీ మండల, టౌన్ అధ్యక్షులతో శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు.
Read Also: అఖిలేష్ యాదవ్ సంచలన నిర్ణయం
Also Read
మరోవైపు ఏపీ, తెలంగాణను మళ్లీ కలుపుతారంటూ వస్తున్న వార్తలపై మధుయాష్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రను కలపాలని ఎవరూ మాట్లాడొద్దని హితవు పలికారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. అది సోనియా గాంధీ నిర్ణయంతో ఆవిష్కృతమైందని ఆయన తెలిపారు. అధికార దాహంతో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ, ఆంధ్రను కలపాలని కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రెండు రాష్ట్రాలను కలపాలని జగ్గారెడ్డి మాట్లాడటం ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. అది ఏ మాత్రం పార్టీ నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ఈ విషయంపై జగ్గారెడ్డిని వివరణ అడగ్గా.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాటిచ్చారని మధుయాష్కీ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు ఆకాంక్ష నెరవేరడం లేదనే విషయం జగ్గారెడ్డి అభిప్రాయమన్నారు. మరోవైపు తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు బాధ్యులు ఎవరని ప్రభుత్వాన్ని మధుయాష్కీ ప్రశ్నించారు. నిరుద్యోగుల సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేయాలని కోరారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!