ఈ ఎన్నికల్లో మనం గెలవబోతున్నాం.. శ్రేణులకు ఠాగూర్ దిశానిర్దేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగార్జున సాగర్ లోని జానారెడ్డి ఇంట్లో ఇంఛార్జి ఠాగూర్ అధ్యక్షతన కాంగ్రెస్ సీనియర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం సభ, సాగర్ లో తాజా పరిస్థితిపై సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి పిసిసి చీఫ్ ఉత్తమ్, జానారెడ్డి… రేవంత్ హాజరయ్యారు.
పోలింగ్ ముగిసే వరకు నాయకులు ఎవరు హైదరాబాద్ వెళ్లొద్దు
Also Read
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం.. ఎయిర్పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
- Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
ఈ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ పోలింగ్ ముగిసే వరకు నాయకులు ఎవరు హైదరాబాద్ వెళ్లొద్దని, సాగర్ నియోజకవర్గ పరిధి పొరుగున ఉండాలని అన్నారు. టీఆర్ఎస్ ఏ స్థాయికి వస్తే.. మనం కూడా ఆ స్థాయికి వెళ్లాలని, మనకు ఈ ఎన్నిక జీవన్మరణ సమస్య అని పేర్కొన్నట్టు సమాచారం. కెసిఆర్ సభ అట్టర్ ప్లాప్ అయిందని, జనం నుంచి స్పందన కూడా లేదని అన్నారు. సాగర్ కి జానారెడ్డి ఏం చేయలేదని చెప్పిన కేసీఆర్… ఏడేళ్ల లో ఏం చేశారో చెప్పలేదని, పసలేని పనులు…పనికి మాలిన మాటలు అంటూ ఎద్దేవా చేశారు.
రెండు రోజులు పార్టీ నాయకులు అలెర్ట్ గా ఉండాలి
రేవంత్ మాట్లాడుతూ పోలీసు యంత్రాంగంతోనే టీఆర్ఎస్ ఎన్నికలు చేయాలని చూస్తుందని, రేపు సాయంత్రం 7 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చని అన్నారు. కెసిఆర్ ఊహించిన స్థాయిలో సభ లేదని, దీని ప్రభావం.. పోలింగ్ మీద ఉంటుందని అన్నారు. కెసిఆర్ వ్యవహార శైలి…డిఫెన్స్ శైలిలో జరిగిందని, సాగర్.. హాలియాలో జానారెడ్డి తెచ్చినవి కెసిఆర్ తరలించారని అన్నారు. జానారెడ్డి తెచ్చిన కాలేజీలను కేసీఆర్ డిగ్రీ కాలేజీ చేస్తున్నారని అంతకు మించి చేసేది లేదని అన్నారు. వచ్చే రెండు రోజులు పార్టీ నాయకులు అలెర్ట్ గా ఉండాలని, మీ అందరికీ మేము అండగా ఉంటామని అన్నారు.
కార్యకర్తలను రక్షించుకునే బాధ్యత మాది
జానారెడ్డి మాట్లాడుతూ ఏదేమైనా… ఈ ఎన్నికలు ఛాలెంజ్ గా తీసుకోవాలని, 2023 లో పార్టీ నీ పూర్వ వైభవాన్ని తేవాలని అన్నారు. నాకు అండగా వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన ఆయన స్టార్ క్యాంపైనర్ లు అందరూ దేవరకొండ..మిర్యాలగూడ లలో ఉండండని, ఇంఛార్జి లు… ఆయా గ్రామాలలో మానిటరింగ్ చేయండని అన్నారు. ఎలాంటి ఇబ్బంది ఎదురైనా… ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయండి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుల అరెస్టులను ఖండిస్తున్నామన్న ఆయన కార్యకర్తలను రక్షించుకునే బాధ్యత మాదని అన్నారు.
కాంగ్రెస్ విజయం సాగర్ నుండే మొదలు
ఇక రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మనం గెలవబోతున్నాం, కెసిఆర్ నియంతృత్వం కి ఈ ఎన్నికలు పులిస్టప్ పెట్టబోతున్నాయని అన్నారు. వచ్చే రెండు రోజులు కీలకం ఇంఛార్జి లు జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. భారీ మెజారిటీతో గెలుస్తున్నామన్న ఆయన కాంగ్రెస్ విజయం సాగర్ నుండే మొదలు కాబోతుందని అన్నారు.
తాజావార్తలు
-
MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
-
FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
-
Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
-
Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!