ఈ ఎన్నికల్లో మనం గెలవబోతున్నాం.. శ్రేణులకు ఠాగూర్ దిశానిర్దేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగార్జున సాగర్ లోని జానారెడ్డి ఇంట్లో ఇంఛార్జి ఠాగూర్ అధ్యక్షతన కాంగ్రెస్ సీనియర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం సభ, సాగర్ లో తాజా పరిస్థితిపై సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి పిసిసి చీఫ్ ఉత్తమ్, జానారెడ్డి… రేవంత్ హాజరయ్యారు.
పోలింగ్ ముగిసే వరకు నాయకులు ఎవరు హైదరాబాద్ వెళ్లొద్దు
Also Read
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
ఈ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ పోలింగ్ ముగిసే వరకు నాయకులు ఎవరు హైదరాబాద్ వెళ్లొద్దని, సాగర్ నియోజకవర్గ పరిధి పొరుగున ఉండాలని అన్నారు. టీఆర్ఎస్ ఏ స్థాయికి వస్తే.. మనం కూడా ఆ స్థాయికి వెళ్లాలని, మనకు ఈ ఎన్నిక జీవన్మరణ సమస్య అని పేర్కొన్నట్టు సమాచారం. కెసిఆర్ సభ అట్టర్ ప్లాప్ అయిందని, జనం నుంచి స్పందన కూడా లేదని అన్నారు. సాగర్ కి జానారెడ్డి ఏం చేయలేదని చెప్పిన కేసీఆర్… ఏడేళ్ల లో ఏం చేశారో చెప్పలేదని, పసలేని పనులు…పనికి మాలిన మాటలు అంటూ ఎద్దేవా చేశారు.
రెండు రోజులు పార్టీ నాయకులు అలెర్ట్ గా ఉండాలి
రేవంత్ మాట్లాడుతూ పోలీసు యంత్రాంగంతోనే టీఆర్ఎస్ ఎన్నికలు చేయాలని చూస్తుందని, రేపు సాయంత్రం 7 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చని అన్నారు. కెసిఆర్ ఊహించిన స్థాయిలో సభ లేదని, దీని ప్రభావం.. పోలింగ్ మీద ఉంటుందని అన్నారు. కెసిఆర్ వ్యవహార శైలి…డిఫెన్స్ శైలిలో జరిగిందని, సాగర్.. హాలియాలో జానారెడ్డి తెచ్చినవి కెసిఆర్ తరలించారని అన్నారు. జానారెడ్డి తెచ్చిన కాలేజీలను కేసీఆర్ డిగ్రీ కాలేజీ చేస్తున్నారని అంతకు మించి చేసేది లేదని అన్నారు. వచ్చే రెండు రోజులు పార్టీ నాయకులు అలెర్ట్ గా ఉండాలని, మీ అందరికీ మేము అండగా ఉంటామని అన్నారు.
కార్యకర్తలను రక్షించుకునే బాధ్యత మాది
జానారెడ్డి మాట్లాడుతూ ఏదేమైనా… ఈ ఎన్నికలు ఛాలెంజ్ గా తీసుకోవాలని, 2023 లో పార్టీ నీ పూర్వ వైభవాన్ని తేవాలని అన్నారు. నాకు అండగా వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన ఆయన స్టార్ క్యాంపైనర్ లు అందరూ దేవరకొండ..మిర్యాలగూడ లలో ఉండండని, ఇంఛార్జి లు… ఆయా గ్రామాలలో మానిటరింగ్ చేయండని అన్నారు. ఎలాంటి ఇబ్బంది ఎదురైనా… ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయండి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుల అరెస్టులను ఖండిస్తున్నామన్న ఆయన కార్యకర్తలను రక్షించుకునే బాధ్యత మాదని అన్నారు.
కాంగ్రెస్ విజయం సాగర్ నుండే మొదలు
ఇక రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మనం గెలవబోతున్నాం, కెసిఆర్ నియంతృత్వం కి ఈ ఎన్నికలు పులిస్టప్ పెట్టబోతున్నాయని అన్నారు. వచ్చే రెండు రోజులు కీలకం ఇంఛార్జి లు జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. భారీ మెజారిటీతో గెలుస్తున్నామన్న ఆయన కాంగ్రెస్ విజయం సాగర్ నుండే మొదలు కాబోతుందని అన్నారు.
తాజావార్తలు
-
Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
-
PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
-
Sonakshi Sinha: సోషల్ మీడియా వల్ల ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది..
-
Virat Kohli: “ప్రతి సీజన్ను నరకంలా అనుభవించాను”.. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
-
PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..