Congress Protests: అస్సాం సీఎంపై రగడ… కాంగ్రెస్ ధర్నాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీనేతలు మండిపడుతూనే వున్నారు. జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు చేశారు. కానీ మిగిలిన ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోకపోవడంతో ధర్నా, ఆందోళనలకు దిగింది. ఇవాళ పోలీస్ కమిషనరేట్ల ముందు, ఎస్పీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ ధర్నాలు చేయనుంది.
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయనందుకు నిరసనగా పోలీస్ కమీషనరేట్స్ ముందు ఎస్పీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ ధర్నాలు చేస్తుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. హైదరాబాద్ కమిషనరేట్ వద్ద తాను, రాచకొండ కమిషనరేట్ వద్ద ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొంటారని రేవంత్ రెడ్డి తెలిపారు.
Also Read
ఉదయం 11 గంటలకు నిజాం కాలేజి గ్రౌండ్స్ నుంచి కమిషనరేట్ వరకు ప్రదర్శన అక్కడ ధర్నా.. ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలన్నారు. కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ గారిపైన అస్సాం సీఎం హిమంత్ బిస్వ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలని ఆధారాలతో సహా కాంగ్రెస్ శ్రేణులు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 709 పోలీస్ స్టేషన్లలో ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ జూబ్లిహిల్స్ లో తప్ప మిగలిన ఏ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయలేదు. అందుకు నిరసనగా డీసీసీల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయాల ముందు.. నగరాలలో పోలీస్ కమిషనరేట్ల ముందు భారీ ధర్నాలు చేసి నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క నాయకులు ఈ ధర్నాలో పాల్గొని అస్సాం సీఎం పైన కేసు నమోదు అయ్యే వరకు పోరాటం చెయ్యాలన్నారు.కాంగ్రెస్ పిలుపుతో సీపీ ఆఫీస్, నిజాం కాలేజి, బషీర్ బాగ్ చౌరస్తాలలో భారీగా బలగాలు మోహరించారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!