కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు చూపు లేకనే ఈ పరిస్థితులు వచ్చాయి అని అన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ పరిస్థితి కారణం ప్రధాని మోడీ ,సీఎం కేసీఆరే అని తెలిపారు. గతేడాది అసెంబ్లీలో భట్టి విక్రమార్క అడిగితే ఆరోగ్య శ్రీ లో చేర్చాలని అడిగితే ఒప్పుకున్నాడు. 9నెలలు అవుతున్న ఇప్పటికి అమలు లేదు. ఎన్నికల్లో గెలవడం, నాయకులను కొనడం పైనే కేసీఆర్ దృష్టి ఉంది. ఎంతోమంది చనిపోతున్న కేసీఆర్ కు పట్టింపులేదు. ధనిక రాష్ట్రం అని చెప్పి పనికిరాని ప్రాజెక్టుల కు ఖర్చు నచేయడం కాదు. కరోనా వైద్యం ఉచితంగా అందించాలి. మనసు లేని మృగం లాగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నాడు అని… ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలి అని పేర్కొన్నారు.