Congress High Command Serious over MLA Komatireddy Raj Gopal Reddy Issue.
గత కొంతకాలంగా కాంగ్రెస్ క్రియాశీలక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి చేరున్నట్లు వార్తలు గుప్పుమంటున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ త్వరలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ చేరుతారని.. అందుకు తేదీని కూడా ప్రకటిస్తామని ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో.. ఇప్పడిప్పుడే తెలంగాణలో పుంజుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై సీరియస్గా ఉంది. అయితే తాజాగా ఢిల్లీలో కేసీ వేణు గోపాల్ నివాసంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి, మానిక్కం ఠాగూర్లు భేటీ అయ్యారు.
రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ను విడిచి వెళ్లకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడమా… లేకుంటే సస్పెండ్ చేయడమా అనే దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడిప్పుడే తెలంగాణలో బలపడుతున్న కాంగ్రెస్ నుంచి ముఖ్య నేతల్లో ఒకరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడటమంటే.. కాంగ్రెస్ పార్టీకి ఆ నియోజకవర్గంలో పట్టుకోల్పోవడమే అవుతుంది. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకుంటే.. ఎన్నికలకు ఏడాది సమయమున్నా ఆ నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డిపై గెలిచే వ్యక్తిని కాంగ్రెస్ బరిలో దించేలేదనే చెప్పాలి. చూడాలి మరీ ఏం జరుగుతుందో.