Congress Bus Yatra Day 2: రాహుల్ కు అనుమతి లేదు.. రేవంత్కు మాత్రమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Bus Yatra Day 2: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మూడు రోజులు బస్సు యాత్రలో భాగంగా జాతీయ స్థాయి నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు 8 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రెండో రోజైన ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మీదుగా ఏఐసీసీ అగ్రనేతలు రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీ విజయభేరి బస్సు యాత్ర నిర్వహించనున్నారు. మేడిపల్లి వద్ద పార్టీ శ్రేణులు స్వాగతం పలకనున్నారు. బైక్ ర్యాలీ ద్వార కాటారం సెంటర్ కి రాహుల్ గాంధీ చేరుకొనున్నారు. కాటారం సెంటర్ లో సభలో రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రసంగించనున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కే.టి.పీ.పీ గోదావరి గెస్ట్ హౌస్ లో నేడు రేవూరి ప్రకాష్ రెడ్డి తో పాటు మరికొంద మంది రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అనంతరం బస్సు యాత్ర కేటీకే 5వ గని నుండి బాంబులగడ్డ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. కేటికే 1.వ గని వద్ద సింగరేణి కార్మికులతో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గేట్ మీటింగ్ నిర్వహించనున్నారు. అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడానున్నారు. సింగరేణి ఒకటో గని గేట్ మీటింగ్ కి రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడంతో చర్చనీయాంశంగా మారింది. కాగా పీసీసీ చీఫ్ రేవంత్., భట్టి లకు మాత్రమే సింగరేణి ఒకటో గని గేట్ మీటింగ్ కు అనుమతి ఇవ్వడంతో సింగరేణి కార్మికులతో రేవంత్, శ్రీధర్ బాబు, పొంగులేటి మాట్లాడనున్నారు. అనంతరం బాంబులగడ్డ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. కాగా గతంలో టీఆర్ఎస్ పక్షాన ప్రచారం చేశా నని పొంగులేటి అన్నారు. కానీ సాధించింది ఏం లేదని తెలిపారు. చెప్పిన మాటలు బూటకం అయ్యాయన్నారు. కార్మికులకు ఆదాయ పన్ను తగ్గిస్తామని బీఆర్ఎస్ చెప్పిందని గుర్తుచేశారు. పైరవి చేస్తున్న వారికే వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నారని మండిపడ్డారు.
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
నేటి షెడ్యూల్..
* 19వ తేదీన భూపాలపల్లి నుంచి కాటారం కి చేరుకోనున్న బస్సు యాత్ర
* కాటారం పాదయాత్రలో రాహుల్ గాంధీతో పాటు పీసీసీ రేవంత్ రెడ్డిచ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
* మంథని నుంచి పెద్దపల్లి వెళ్లనున్న బస్సు యాత్ర
* పెద్దపల్లి నుంచి కరీంనగర్ కు బస్సు యాత్ర
* కరీంనగర్ లో నైట్ హాల్ట్ చేయనున్న రాహుల్ గాంధీ
20న షెడ్యూల్..
* ఎల్లుండి 20వ తేదీన కరీంనగర్ నుంచి బోధన్ ఆర్మూరు మీదుగా నిజామాబాద్ వరకు కాంగ్రెస్ బస్సు యాత్ర కొనసాగనుంది.
* బోధన్ లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని రాహుల్ గాంధీ సందర్శించనున్నారు.
* ఆర్మూరులో కాంగ్రెస్ బహిరంగ సభ జరుగనుంది.
* పసుపు.. చెరుకు రైతులతో రాహుల్ ప్రత్యేకంగా సమావేశం అవుతారు.
* నిజామాబాద్ లో పాదయాత్రలో పాల్గొంటారు. దీంతో 20వ తేదీ సాయంత్రం తో టీ కాంగ్రెస్ బస్సుయాత్ర మొదటి విడత ముగియనుంది.
Mehreen Pirzada: పొట్టి డ్రెస్లో థైస్ షో చేస్తూ కిల్లింగ్ పోజులు.. వైన్ షాప్ లో హాట్ గా మెహ్రీన్..
తాజావార్తలు
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!