Lok Sabha Elections 2024: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. నేడు అభ్యర్థులను ప్రకటించే అవకాశం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections 2024: రాష్ట్రంలోని మిగిలిన లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ఇవాళ ఖరారు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగానే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం ఢిల్లీ వెళ్లారు. సీఎంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షీ కూడా ఉన్నారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఈరోజు సాయంత్రం సమావేశం కానుంది.
Read also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
Also Read
- Konda Surekha: కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్కు రంగం సిద్ధం?
- Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
- DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
- Congress Disciplinary Action: కాంగ్రెస్లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
ఈ సమావేశంలో పెండింగ్లో ఉన్న పార్లమెంట్ సీట్లపై చర్చించి అభ్యర్థుల ఫైర్ను సీఈసీ ఖరారు చేయనుంది. కాగా.. రాష్ట్రంలోని మొత్తం 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 13 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ మరో నాలుగు పెండింగ్లో ఉన్నందున.. ఈ నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గీయులు వెల్లడించారు. అధికారులతో మాట్లాడి అభ్యర్థులపై చర్చించి అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. పెండింగ్లో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించింది. పోటీ ఎక్కువగా ఉండడంతో నేడు అధికారులతో చర్చించి పేర్లను ఖరారు చేయనున్నారు.
Read also: Rapido Cab Services: ‘ఓకే చలో’ యాప్ సేవలు.. క్యాబ్ను ఎంపిక చేసుకునే అవకాశం..!
తెలంగాణలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జులను నియమించిన విషయం తెలిసిందే.. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మంత్రులు, సీనియర్ నేతలను ఇన్ఛార్జ్లుగా నియమిస్తూ మార్పులు చేసినట్లు కాంగ్రెస్ హైకమాండ్ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మంకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వరంగల్ రేవూరి ప్రకాష్ రెడ్డి, మహబూబాబాద్ తుమ్మల నాగేశ్వరరావులను నియమించారు.
Read also: MLC Kavitha: నేడు కవిత బెయిల్ పిటిషన్పై విచారణ..
హైదరాబాద్ కు ఒబేదుల్లా కొత్వాల్, సికింద్రాబాద్ కోమటిరెడ్డి వెంకట రెడ్డి, భువనగిరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నాగర్ కర్నూల్ జూపల్లి కృష్ణారావు, మహబూబ్ నగర్ సంపత్ కుమార్, చేవెళ్ల వేంనరేందర్ రెడ్డిలను నియమించారు. ఇన్ చార్జిలుగా మల్కాజిగిరి మైనంపల్లి హనుమంతరావు, మెదక్ కొండ సురేఖ, నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ సీతక్క, జహీరాబాద్ దామోదర రాజనర్సింహలను నియమించారు. ఈ నెల 6న తుక్కుగూడలో నిర్వహించనున్న బహిరంగ సభపై సీఈసీ సమావేశంలో సీఎం, డిప్యూటీ సీఎం ముఖ్యనేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
Konda Surekha: కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్కు రంగం సిద్ధం?
-
Suriya – Karthi : సూర్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్.. ఇప్పుడు కార్తీ వంతు
-
Polavaram Rehabilitation: తాడువాయిలోనే ఇళ్లు కావాలి.. పోలవరం నిర్వాసితుల భారీ ధర్నా!
-
Rana Daggubati: ఇక హీరోల హవా తగ్గినట్టేనా? డైరెక్టర్ల బ్రాండ్పై రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Devarakonda Family : దేవరకొండ ఫ్యామిలీ నుండి నెలకో సినిమా రిలీజ్కు రెడీ
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!