Nizamabad:విద్యార్థుల మధ్య ఘర్షణ.. బ్లేడ్ తో దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజమాబాద్ జిల్లా నవిపేట మండలం శివతండాలో బ్లేడ్ దాడి కలకలం రేపింది. 10వ తరగతి విద్యార్థి పై 9వ తరగతి బాలుడు బ్లేడ్ తో దాడి చేసాడు. దీంతో 10వ తరగతి విద్యార్థికి మెడపై మరో రెండు చోట్ల గాయాలయ్యాయి. నవిపేట ఆదర్శ పాఠశాలలో ఈఘటన చోటుచేసుకుంది.
ఇక వివరాల్లోకి వెళితే.. నిజమాబాద్ జిల్లా నవిపేట మండలం శివ తండాలో నివాసం ఉంటున్న విద్యార్థులు.. రోజులాగానే నవిపేట ఆదర్శ పాట శాలకు బయలు దేరారు. పాఠశాలకు వెళ్ళిన 10 తరగతి విద్యార్థి, 9వ తరగతి విద్యార్థికి మాట మాట పెరిగింది. దీంతో రెచ్చిపోయిన 9వ తరగతి విద్యార్థి తన వద్ద వున్న బ్లేడ్ తో 10వ తరగతి విద్యార్ధి పై దాడి చేశాడు. మెడపై మరో రెండు చోట్లు దాడి చేయడంతో.. 10వ తరగతి విద్యార్థి తీవ్ర గాయాలయ్యాయి. ఖంగుతిన్న తోటి విద్యార్థులు పాఠశాల యాజమాన్యానికి ఈవిషయం తెలుపడంతో.. అప్రమత్తమైన యాజమాన్యం హుటాహుటిన 10వ తరగతి విద్యార్థిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
Also Read
- KTR: "మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలి".. అలాంటి వాళ్లకే కార్పొరేట్ టికెట్ ఇస్తామన్న కేటీఆర్..
- Hyderabad: పసిబిడ్డతో వెళ్తున్న మహిళపై కామాంధుడి వికృత చేష్టలు.. ఇంకొకడు ఇలాంటి పని చేయాలంటే వణుకు పుట్టేలా..
- OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
అయితే వీరిద్దరి మద్య గొడవ ఎందుకు తలత్తింది అనేది ఇంకా పూర్తీ వివరాలు తెలియరాలేదు. దీనిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల యాజమాన్యం పై మండి పడుతున్నారు. పాఠశాలలో ఇదంతా జరుగుతున్నా యాజమాన్యం ఎక్కడికి పోయారని, వాళ్లకు తెలియకుండా ఇదంతా జరిగిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాన్నారు. చిన్న పిల్లలు దాడి వరకు వచ్చారంటే టీచర్లు ఏం చేస్తున్నారని భావోద్వేగానికి లోనయ్యారు. ఇప్పటికైనా యాజయం ఇటువంటి చర్యలు జరగకుండా పాఠశాలపై నిఘా ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
అయితే.. హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో (3 Mar 2022)న దారుణ మైన ఘటన వెలుగుచూసింది. డిజిటల్ తరగతిలో అల్లరి చేస్తుండగా వారించినందుకు ఇద్దరు విద్యార్థులు క్లాస్మేట్ని దారుణంగా కొట్టారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్న బాధితుడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. హైదరాబాద్లోని కృష్ణానగర్ సాయికృప పాఠశాలలో ఈ ఘటన జరిగింది.
ఈ విషయాన్ని ఓ విద్యార్థి స్కూల్ ప్రిన్సిపల్ అంజనారావుకు చెప్పడంతో ఆమె మంజూర్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో నిర్వాహకులు విద్యార్థులందరినీ ఇళ్లకు పంపేసి పాఠశాలను మూసివేశారు. అయితే స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడంటూ విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Undavalli Arun Kumar: సీఎం జగన్కు ఉండవల్లి లేఖ.. విషయం ఇదే..
తాజావార్తలు
-
Satya Kumar Yadav: ‘ఎబోలా’పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
-
Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
-
Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
-
West Bengal: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బ్యాడ్ న్యూస్.. బెంగాల్ ప్రభుత్వం బిగ్ యాక్షన్! ఆ సెంటర్లు రెడీ..
-
RR VS MI: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ వైపే..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?