KTR: సీఎం వేస్తారేమో అనుకున్నాం.. ఢిల్లీకి వెళ్లారు.. డిప్యూటీ సీఎం, వ్యవసాయ మంత్రి ఎవరైనా రండి చర్చిద్దాం
- వ్యవసాయంపై చర్చకు సీఎం సవాల్కు కేటీఆర్ సమాధానం
- సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా మాటల యుద్ధానికి సిద్ధమైన కేటీఆర్
- రాజకీయ ఉద్రిక్తతల మధ్య పోలీసుల భారీ బందోబస్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగంపై ఎవరు ఏం చేశారనే అంశంపై ఓపెన్ డిబేట్కు సవాల్ విసరగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ సవాల్ను స్వీకరించారు. సీఎం ఎక్కడైనా వేదికను సూచిస్తే తాను చర్చకు సిద్ధమని స్పష్టంగా ప్రకటించిన కేటీఆర్, ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద తాను సిద్ధంగా ఉంటానని ప్రకటించారు.
Kingdom : కింగ్డమ్.. హిందీ రిలీజ్ కు రామ్.. రామ్
Also Read
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
తన మాట ప్రకారమే కేటీఆర్ ముందుగా తెలంగాణ భవన్ చేరుకుని, అనంతరం ప్రెస్ క్లబ్కు వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆయనతో కలిసి రావడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మోసపూరిత పాలన జరుగుతుందని, రైతులను, మహిళలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 18 నెలలుగాకాంగ్రెస్ అరచాకాలను ఎండగడుతున్నామని, అసెంబ్లీ లో చర్చ పెట్టమని ఆడిగామన్నారు. సీఎంరేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ ఎవరైనా రండి సవాల్ విసిరారని, 72 గంటల సమయం ఇచ్చామన్నారు కేటీఆర్. సోమజిగూడా ప్రెస్ క్లబ్ కు చర్చ కు రమ్మని చెప్పామని, చర్చించడానికి వెళుతున్నామన్నారు. సీఎం వేస్తారేమో అనుకున్నామని, ఢిల్లీ కి వెళ్లారు.. ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి ఎవరైనా రండి చర్చిద్దామన్నారు. ఎవరితో అయినా సిద్ధమే ఈ రోజు కాకపోయినా మరోరోజు అయినా సీఎం రావచ్చని ఆయన అన్నారు. రేపు అసెంబ్లీలో పెడతాం అని సీఎం మాటిస్తే మేము సిద్ధమని, మీకు పరిపాలన చేత కాకపోతే తప్పుకోండి.. కేసీఆర్ వచ్చి పాలన చేస్తారన్నారు కేటీఆర్.
మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ప్రెస్ క్లబ్కు రావచ్చన్న వార్తలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విపరీతంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుని, పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. కేటీఆర్ ముందుగా చెప్పినట్టు చింతమడక, కొడంగల్, గజ్వేల్ వంటి ప్రాంతాల్లో ఎక్కడైనా చర్చ జరపడానికి తాను సిద్ధమని ప్రకటించినప్పటికీ, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ను వేదికగా ఎంపిక చేశారు. రాజకీయ చర్చ పేరుతో మొదలైన ఈ పరిణామం, పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి.
Tamil Nadu: ఘోర విషాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ట్రైన్.. ఇద్దరు విద్యార్థుల మృతి
తాజావార్తలు
-
Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
-
Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
-
KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
-
Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
-
Layoffs: జాబ్స్కు రెడ్ అలెర్ట్.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఎందుకు ఊడుతున్నాయ్..? కాగ్నిజెంట్ నివేదికలో ఏముంది?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!