KTR: సీఎం వేస్తారేమో అనుకున్నాం.. ఢిల్లీకి వెళ్లారు.. డిప్యూటీ సీఎం, వ్యవసాయ మంత్రి ఎవరైనా రండి చర్చిద్దాం
- వ్యవసాయంపై చర్చకు సీఎం సవాల్కు కేటీఆర్ సమాధానం
- సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా మాటల యుద్ధానికి సిద్ధమైన కేటీఆర్
- రాజకీయ ఉద్రిక్తతల మధ్య పోలీసుల భారీ బందోబస్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగంపై ఎవరు ఏం చేశారనే అంశంపై ఓపెన్ డిబేట్కు సవాల్ విసరగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ సవాల్ను స్వీకరించారు. సీఎం ఎక్కడైనా వేదికను సూచిస్తే తాను చర్చకు సిద్ధమని స్పష్టంగా ప్రకటించిన కేటీఆర్, ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద తాను సిద్ధంగా ఉంటానని ప్రకటించారు.
Kingdom : కింగ్డమ్.. హిందీ రిలీజ్ కు రామ్.. రామ్
Also Read
తన మాట ప్రకారమే కేటీఆర్ ముందుగా తెలంగాణ భవన్ చేరుకుని, అనంతరం ప్రెస్ క్లబ్కు వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆయనతో కలిసి రావడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మోసపూరిత పాలన జరుగుతుందని, రైతులను, మహిళలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 18 నెలలుగాకాంగ్రెస్ అరచాకాలను ఎండగడుతున్నామని, అసెంబ్లీ లో చర్చ పెట్టమని ఆడిగామన్నారు. సీఎంరేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ ఎవరైనా రండి సవాల్ విసిరారని, 72 గంటల సమయం ఇచ్చామన్నారు కేటీఆర్. సోమజిగూడా ప్రెస్ క్లబ్ కు చర్చ కు రమ్మని చెప్పామని, చర్చించడానికి వెళుతున్నామన్నారు. సీఎం వేస్తారేమో అనుకున్నామని, ఢిల్లీ కి వెళ్లారు.. ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి ఎవరైనా రండి చర్చిద్దామన్నారు. ఎవరితో అయినా సిద్ధమే ఈ రోజు కాకపోయినా మరోరోజు అయినా సీఎం రావచ్చని ఆయన అన్నారు. రేపు అసెంబ్లీలో పెడతాం అని సీఎం మాటిస్తే మేము సిద్ధమని, మీకు పరిపాలన చేత కాకపోతే తప్పుకోండి.. కేసీఆర్ వచ్చి పాలన చేస్తారన్నారు కేటీఆర్.
మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ప్రెస్ క్లబ్కు రావచ్చన్న వార్తలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విపరీతంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుని, పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. కేటీఆర్ ముందుగా చెప్పినట్టు చింతమడక, కొడంగల్, గజ్వేల్ వంటి ప్రాంతాల్లో ఎక్కడైనా చర్చ జరపడానికి తాను సిద్ధమని ప్రకటించినప్పటికీ, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ను వేదికగా ఎంపిక చేశారు. రాజకీయ చర్చ పేరుతో మొదలైన ఈ పరిణామం, పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి.
Tamil Nadu: ఘోర విషాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ట్రైన్.. ఇద్దరు విద్యార్థుల మృతి
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “టాస్ వేసేదాకా చెప్పలేదు”.. తీవ్ర నిరాశతో కన్నీరు పెట్టినంత పని చేసిన వైభవ్.. సీనియర్స్ ఫైర్!
-
Mohanlal: క్రిషాండ్తో మోహన్లాల్ కొత్త ప్రయోగం.. ‘చోటా ముంబై’ తరహా ఎంటర్టైనర్కు రంగం సిద్ధం!
-
Harry Brook: టీమిండియా బౌలింగ్ జుజుబి.. చాలా సరదాగా బ్యాటింగ్ చేశాం.. హ్యారీ బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Argentina vs Switzerland: అల్వారెజ్, మార్టినెజ్ల మాయాజాలం.. సెమీఫైనల్కు దూసుకెళ్లిన అర్జెంటీనా..
-
Samsung Galaxy Tab S12+: సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+ ఫస్ట్ లుక్.. ఫ్రంట్ డిజైన్ వెల్లడి, త్వరలో లాంచ్?
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!