Jana Jatara Sabha: నేడు నారాయణపేటలో రేవంత్ పర్యటన.. జనజాతర సభకు హాజరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jana Jatara Sabha: నేడు నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మహబుబ్ నగర్ పార్లమెంట్ పై రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. జనజాతర పేరుతో నారాయణపేట జిల్లా కేంద్రంలో బారీ భహిరంగ సభకు హాజరుకానున్నారు. జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో సభ జరగనుంది. మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్ ద్వారా నారాయణపేటకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. డిగ్రీ కళాశాల మైదానంలో సభ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
Read also: TS Weather: ఈ వారం మరింత పెరగనున్న ఎండలు.. ఐఎండి అలర్ట్
Also Read
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
బారీగా జనసమీకరణ చేసేందుకు ముఖ్య నేతల కార్యాచరణ చేపట్టారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలో బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సభకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు,మంత్రులు హాజరుకానున్నారు. ఆయన సొంత జిల్లా కావడంతో కొడంగల్ నియోజకవర్గం మహబూబ్నగర్ పరిధిలో ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోస్గిలో జరిగిన సభలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డి పేరును రేవంత్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత నెల 6న మహబూబ్నగర్లో భారీ సభ, ఇప్పుడు నారాయణపేటలో బహిరంగ సభ.. నారాయణపేట జిల్లాలోని రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థికి మెజార్టీ రాకుండా చేసేందుకు ఈ సభను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Read also: Car Accident: దుండిగల్ లో కారు బీభత్సం.. ఒకరు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు
వంశీచంద్ గెలుపు కోసం మరో సభ నిర్వహించి నామినేషన్ దాఖలుకు సీఎం హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తన పర్యటన ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నారు. అలాగే బీజేపీకి కొంత బలం ఉందని భావిస్తున్న నియోజకవర్గాల్లో ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా నేతలను చేర్చుకుంటున్నారు. ఇప్పటికే మక్తల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాదిరెడ్డి జలంధర్ రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో పాటు మరికొందరు నేతలు కూడా సోమవారం జరిగే సమావేశంలో పార్టీలో చేరే అవకాశం ఉంది.
KCR: రేపు సంగారెడ్డిలో కేసీఆర్ భారీ బహిరంగ సభ..
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!