Jana Jatara Sabha: నేడు నారాయణపేటలో రేవంత్ పర్యటన.. జనజాతర సభకు హాజరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jana Jatara Sabha: నేడు నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మహబుబ్ నగర్ పార్లమెంట్ పై రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. జనజాతర పేరుతో నారాయణపేట జిల్లా కేంద్రంలో బారీ భహిరంగ సభకు హాజరుకానున్నారు. జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో సభ జరగనుంది. మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్ ద్వారా నారాయణపేటకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. డిగ్రీ కళాశాల మైదానంలో సభ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
Read also: TS Weather: ఈ వారం మరింత పెరగనున్న ఎండలు.. ఐఎండి అలర్ట్
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
బారీగా జనసమీకరణ చేసేందుకు ముఖ్య నేతల కార్యాచరణ చేపట్టారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలో బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సభకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు,మంత్రులు హాజరుకానున్నారు. ఆయన సొంత జిల్లా కావడంతో కొడంగల్ నియోజకవర్గం మహబూబ్నగర్ పరిధిలో ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోస్గిలో జరిగిన సభలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డి పేరును రేవంత్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత నెల 6న మహబూబ్నగర్లో భారీ సభ, ఇప్పుడు నారాయణపేటలో బహిరంగ సభ.. నారాయణపేట జిల్లాలోని రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థికి మెజార్టీ రాకుండా చేసేందుకు ఈ సభను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Read also: Car Accident: దుండిగల్ లో కారు బీభత్సం.. ఒకరు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు
వంశీచంద్ గెలుపు కోసం మరో సభ నిర్వహించి నామినేషన్ దాఖలుకు సీఎం హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తన పర్యటన ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నారు. అలాగే బీజేపీకి కొంత బలం ఉందని భావిస్తున్న నియోజకవర్గాల్లో ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా నేతలను చేర్చుకుంటున్నారు. ఇప్పటికే మక్తల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాదిరెడ్డి జలంధర్ రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో పాటు మరికొందరు నేతలు కూడా సోమవారం జరిగే సమావేశంలో పార్టీలో చేరే అవకాశం ఉంది.
KCR: రేపు సంగారెడ్డిలో కేసీఆర్ భారీ బహిరంగ సభ..
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!