CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
- సీఎం ఆదేశాలతో పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డీజీపీ
- రాష్ట్రంలో త్వరలోనే ప్రత్యేకంగా ‘ట్రాఫిక్ బ్యూరో’ ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలిపివేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ సి.వి.ఆనంద్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తన ఢిల్లీ పర్యటన సందర్భంగా ఎయిర్పోర్టు మార్గంలో ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్పై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వాయ్ కోసం సామాన్య ప్రజల పనులకు ఆటంకం కలిగించవద్దని, ఎదురుగా వచ్చే వాహనాలను ఆపి ఇబ్బంది పెట్టవద్దని ఆయన సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరించారు.
అధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్..
ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో డీజీపీ సి.వి.ఆనంద్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి త్వరలోనే ప్రత్యేకంగా ‘ట్రాఫిక్ బ్యూరో’ను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ ప్రకటించారు. ఇకపై వీఐపీ కాన్వాయ్లు వెళ్లే సమయంలో ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేయకుండా, సింగిల్ లైన్లో వాహనాలను అనుమతించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, ఈ సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని సూచించారు.
Also Read
వర్షాకాలం దృష్ట్యా రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి, అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విమానాశ్రయ పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డుపై అక్రమ పార్కింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని కఠినంగా నివారించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అనేది కేవలం ట్రాఫిక్ విభాగం బాధ్యత మాత్రమే కాదని, శాంతిభద్రతల విభాగం కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని డీజీపీ ఆదేశించారు. ఐఎస్డబ్ల్యూ (ISW), సీఎస్డబ్ల్యూ (CSW) విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు ట్రాఫిక్ పరిస్థితిని బట్టి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని, సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ఉన్నతాధికారులు వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Cockroach Janta Party: “బొద్దింకల పార్టీ”పై ఉక్కుపాదం.. అన్ని అకౌంట్లు క్లోజ్..
-
Modi-Marco Rubio: సేవా తీర్థ్లో మోడీతో మార్కో రూబియో భేటీ.. గంటకుపైగా కీలక చర్చలు
-
Telangana Exhibitors Association: ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం.. ‘పెద్ది’ సినిమానే కాదు ఏ సినిమానైనా పర్సంటేజ్ కావాల్సిందే..!
-
Khatti Meethi Dal Recipe: తీపి + పులుపు మ్యాజిక్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడిగే గుజరాతీ కట్టి మీఠీ దాల్.!
-
Girl Elopes With Lover: ఇంట్లో రక్తం చల్లి మిస్సింగ్ డ్రామా.. అసలు నిజం వింటే షాక్..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!