CM Revanth Reddy: థేమ్స్ తరహాలో మూసి నది.. లండన్ టూర్లో రేవంత్ కీలక ఒప్పదం
CM Revanth Reddy: హైదరాబాద్ నడిబొడ్డున మూసీ పునరుజ్జీవనంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తన బృందంతో కలిసి పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులు, థేమ్స్ రివర్ అథారిటీ అధికారులు, నిపుణులతో మూడు గంటల పాటు సమావేశమయ్యారు. మూసీ నది పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై వారితో చర్చించారు. మూసీ నది పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని థేమ్స్ నది పాలకమండలి పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ ఈ సమావేశంలో హామీ ఇచ్చింది. థేమ్స్ నది ప్రక్షాళన తనను లండన్ వెళ్లేలా ప్రేరేపించిందని సీఎం రేవంత్ అన్నారు. మూసీ నది పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారంతో ముందుకు సాగుతుందని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. సాధ్యమయ్యే అనేక సహకార అంశాలపై మరింత సమగ్ర చర్చ జరిగింది. మూసీని పునరుద్ధరణ, సుందరీకరణ చేయడం ద్వారా హైదరాబాద్ నగరంలోని చెరువులకు, ప్రజలకు నీటి సరఫరా సులువవుతుందని, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని సీఎం రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు.
Read also: BJP: దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు రథయాత్ర..
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
ఈ క్రమంలోనే మూసీ నది పరివాహక ప్రాంతమంతా ఉపాధి, ఆర్థికాభివృద్ధి జోన్గా మార్చాలని కొద్దిరోజుల క్రితం జరిగిన అధికారుల సమావేశంలో సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశంపై ఈరోజు పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులతో చర్చలు జరిపారు. మూసీ నది ప్రక్షాళనకు సహకరిస్తామని రేవంత్ రెడ్డికి అధికారులు హామీ ఇచ్చారు. భూమిపై ఉన్న చాలా నగరాలు చారిత్రాత్మకంగా నదులు, సరస్సులు లేదా సముద్రాల వెంట అభివృద్ధి చెందాయి. పట్టణ మానవ నివాసాలకు నీటి వనరులు జీవనాధారం. హైదరాబాద్ మూసీ నదితో అభివృద్ధి చెందింది. కానీ హుస్సేన్సాగర్ సరస్సు మరియు ఉస్మాన్సాగర్ వంటి ఇతర ప్రధాన నీటి వనరుల చుట్టూ కేంద్రీకృతమై ఉన్న అభివృద్ధి ప్రత్యేకమైనది. మూసీని పునరుజ్జీవింపజేసి పూర్తి స్థాయికి తీసుకొచ్చిన తర్వాత.. నదులు, సరస్సుల ద్వారా హైదరాబాద్కు విద్యుత్ సరఫరా అవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.
BJP: దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు రథయాత్ర..
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!