CM Revanth Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత పి.నర్సారెడ్డి మృతి.. సంతాపం తెలిపిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత పి.నర్సారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ప్రజలకు ఎన్నో సేవలు చేశానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. నర్సారెడ్డి అనుభవాలు తమకు మార్గదర్శకమని, ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు.
Read also: Nizamabad CI Arrest: పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో ట్విస్ట్.. నిజామాబాద్ సీఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్..!
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్సారెడ్డి సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం నిర్మల్ జిల్లా మలక్ చించోలి గ్రామం. 1931 సెప్టెంబర్ 22న జన్మించిన నర్సారెడ్డి ఉన్నత విద్యను అభ్యసించారు. ఇందులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ పట్టాలు పొందారు. అతను తన యవ్వనంలో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. హైదరాబాద్ను నిజాం పాలన నుంచి విముక్తి చేసేందుకు జరిగిన పోరాటంలో నర్సారెడ్డి కూడా పాల్గొన్నారు. 1971 నుంచి 1972 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1978 ఎన్నికల తర్వాత నర్సా రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మంత్రివర్గంలో నీటి పారుదల, దేవాదాయ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 1967 నుంచి 1982 వరకు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.1991లో ఆదిలాబాద్ ఎంపీగా, ఒకసారి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు.
Pariksha Pe Charcha: “ఒక పిల్లవాడిని మరొకరితో పోల్చకండి”.. తల్లిదండ్రులకు పీఎం మోడీ సూచన..
తాజావార్తలు
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!