CM KCR: ప్రగతి భవన్ లో కీలక సమావేశం.. రాష్ట్రపతి ఎన్నికపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ పాలిటిక్స్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ తో పాటు మంత్రులు, లోక్ సభ, రాజ్యసభ, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్లు, విప్ లతో కీలక సమావేశం జరుగుతోంది. ముఖ్యంగా కేంద్రం అనుసరిస్తున్న తీరుతో పాటు రాష్ట్రపతి ఎన్నికల గురించి ప్రధాన చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై ప్రధానంగా చర్చ సాగుతోంది.
ఇటీవల కాలంలో బీజేపీకి వ్యతిరేఖంగా కూటమి ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్ పలు రాష్ట్రాల్లోని ప్రముఖ నాయకులను కలుస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసిన కేసీఆర్ రానున్న రోజుల్లో సంచలనం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఇదే విధంగా ఇటీవల కర్ణాటక బెంగళూర్ లో మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని కలిశారు. ఆ సమయంలో కూడా రాష్ట్రపతి ఎన్నికల గురించి ప్రధానంగా చర్చ జరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే విపక్షాలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని రాష్ట్రపతి ఎన్నికలను నిలిపితే ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం దీంతో పాటు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రపతి ఎన్నికలు కీలకంగా మారాయి. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేఖంగా కూటమి కట్టే ప్రయత్నాల్లో టీఆర్ఎస్ పార్టీ ఉంది. కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు విపక్షాలన్నీ ఒకే కూటమిగా ఏర్పడి ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటిస్తాయా.? అనేది కీలకం మారింది. కాంగ్రెస్ పార్టీని కాదని బయటకు వచ్చే పార్టీలు ఎన్ని ఉంటాయనేది ప్రస్తుతానికి సస్పెన్సే. ఇదిలా ఉంటే బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే అభ్యర్థి సునాయసంగా గెలుస్తాయనే వాదనలు కూడా ఉన్నాయి. ఎన్డీయే నుంచి శివసేన, అకాలీదళ్ వెళ్లినా.. ఓడిశాలోని బిజూ జనతాదళ్, ఏపీలోని వైసీపీలు బీజేపీకి సహకరించేందుకు సముఖంగా ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇటువంటి ఈక్వేషన్ల నేపథ్యంలో తాజాగా ప్రగతి భవన్ లో కీలక చర్చ సాగుతోంది.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!