CM KCR: ప్రగతి భవన్ లో కీలక సమావేశం.. రాష్ట్రపతి ఎన్నికపై చర్చ
తెలంగాణ పాలిటిక్స్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ తో పాటు మంత్రులు, లోక్ సభ, రాజ్యసభ, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్లు, విప్ లతో కీలక సమావేశం జరుగుతోంది. ముఖ్యంగా కేంద్రం అనుసరిస్తున్న తీరుతో పాటు రాష్ట్రపతి ఎన్నికల గురించి ప్రధాన చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై ప్రధానంగా చర్చ సాగుతోంది.
ఇటీవల కాలంలో బీజేపీకి వ్యతిరేఖంగా కూటమి ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్ పలు రాష్ట్రాల్లోని ప్రముఖ నాయకులను కలుస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసిన కేసీఆర్ రానున్న రోజుల్లో సంచలనం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఇదే విధంగా ఇటీవల కర్ణాటక బెంగళూర్ లో మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని కలిశారు. ఆ సమయంలో కూడా రాష్ట్రపతి ఎన్నికల గురించి ప్రధానంగా చర్చ జరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే విపక్షాలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని రాష్ట్రపతి ఎన్నికలను నిలిపితే ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం దీంతో పాటు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read
- Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
- RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
- Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
- Off The Record : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా?
టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రపతి ఎన్నికలు కీలకంగా మారాయి. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేఖంగా కూటమి కట్టే ప్రయత్నాల్లో టీఆర్ఎస్ పార్టీ ఉంది. కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు విపక్షాలన్నీ ఒకే కూటమిగా ఏర్పడి ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటిస్తాయా.? అనేది కీలకం మారింది. కాంగ్రెస్ పార్టీని కాదని బయటకు వచ్చే పార్టీలు ఎన్ని ఉంటాయనేది ప్రస్తుతానికి సస్పెన్సే. ఇదిలా ఉంటే బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే అభ్యర్థి సునాయసంగా గెలుస్తాయనే వాదనలు కూడా ఉన్నాయి. ఎన్డీయే నుంచి శివసేన, అకాలీదళ్ వెళ్లినా.. ఓడిశాలోని బిజూ జనతాదళ్, ఏపీలోని వైసీపీలు బీజేపీకి సహకరించేందుకు సముఖంగా ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇటువంటి ఈక్వేషన్ల నేపథ్యంలో తాజాగా ప్రగతి భవన్ లో కీలక చర్చ సాగుతోంది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?