CM KCR: ప్రగతి భవన్ లో కీలక సమావేశం.. రాష్ట్రపతి ఎన్నికపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ పాలిటిక్స్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ తో పాటు మంత్రులు, లోక్ సభ, రాజ్యసభ, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్లు, విప్ లతో కీలక సమావేశం జరుగుతోంది. ముఖ్యంగా కేంద్రం అనుసరిస్తున్న తీరుతో పాటు రాష్ట్రపతి ఎన్నికల గురించి ప్రధాన చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై ప్రధానంగా చర్చ సాగుతోంది.
ఇటీవల కాలంలో బీజేపీకి వ్యతిరేఖంగా కూటమి ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్ పలు రాష్ట్రాల్లోని ప్రముఖ నాయకులను కలుస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసిన కేసీఆర్ రానున్న రోజుల్లో సంచలనం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఇదే విధంగా ఇటీవల కర్ణాటక బెంగళూర్ లో మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని కలిశారు. ఆ సమయంలో కూడా రాష్ట్రపతి ఎన్నికల గురించి ప్రధానంగా చర్చ జరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే విపక్షాలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని రాష్ట్రపతి ఎన్నికలను నిలిపితే ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం దీంతో పాటు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రపతి ఎన్నికలు కీలకంగా మారాయి. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేఖంగా కూటమి కట్టే ప్రయత్నాల్లో టీఆర్ఎస్ పార్టీ ఉంది. కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు విపక్షాలన్నీ ఒకే కూటమిగా ఏర్పడి ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటిస్తాయా.? అనేది కీలకం మారింది. కాంగ్రెస్ పార్టీని కాదని బయటకు వచ్చే పార్టీలు ఎన్ని ఉంటాయనేది ప్రస్తుతానికి సస్పెన్సే. ఇదిలా ఉంటే బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే అభ్యర్థి సునాయసంగా గెలుస్తాయనే వాదనలు కూడా ఉన్నాయి. ఎన్డీయే నుంచి శివసేన, అకాలీదళ్ వెళ్లినా.. ఓడిశాలోని బిజూ జనతాదళ్, ఏపీలోని వైసీపీలు బీజేపీకి సహకరించేందుకు సముఖంగా ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇటువంటి ఈక్వేషన్ల నేపథ్యంలో తాజాగా ప్రగతి భవన్ లో కీలక చర్చ సాగుతోంది.
తాజావార్తలు
-
IPL 2026 Final: రూ.68.75 కోట్ల పేస్ వార్.. ఆర్సీబీ-జీటీ ఫైనల్ ఫలితాన్ని నిర్ణయించేది బౌలర్లేనా?
-
Financial Planning Tips: సంపాదించడం ఒక ఎత్తు.. దాచడం మరో ఎత్తు! మిమ్మల్ని ధనవంతులను చేసే 7 రూల్స్ ఇవే!
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..