CM KCR: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పోగొట్టింది వాళ్ళు.. ఇచ్చింది మేము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పోగొట్టింది వాళ్ళు.. ఇచ్చింది మేము అని సీఎం కేసీఆర్ అన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఓటు నుదుటి రాతను మారుస్తుంది.. అందుకే ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ అన్నారు. అభ్యర్థుల గుణ గణాలు, పార్టీల చరిత్ర చూడాలని అన్నారు. ఉన్న తెలంగాణను ఊడ గొట్టింది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. తలాపున గోదావరీ పారినా తాగే నీళ్ళు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాజ్యంలో రైతు బంధు ఉందా? అని ప్రశ్నించారు. రైతు చనిపొతే 5 లక్షల రూపాయలు వారం రోజుల్లో వాళ్ల ఇంటికే పంపించామన్నారు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తె ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్నారని మండిపడ్డారు. ధరణీ తీసి వేస్తే రైతు బంధు డబ్బులు ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పోగొట్టింది వాళ్ళు.. ఇచ్చింది మేము అని అన్నారు. ఐటి రద్దు చేయమంటే మోడీ వినడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Indrakaran Reddy: మా నిర్మల్ అభివృద్ధి పట్టదా..? మోడీపై ఇంద్రకరణ్ రెడ్డి ఫైర్
Also Read
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
మనం చొరవ తీసుకుని కేసీఆర్ విజయం సాధిస్తారో లేదో చూద్దాం.. తెలంగాణ వస్తుందో చూడాలి. తెలంగాణతో 33 పార్టీలు నిలబడితే తెలంగాణ ఇచ్చాం. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదు’’ అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేయలేదు? పక్కనే గోదావరి ప్రవహిస్తున్నప్పటికీ కాంగ్రెస్ హయాంలో మంచి నీరు కూడా ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్ వల్ల తెలంగాణ 58 ఏళ్లు నష్టపోవాల్సి వచ్చింది. తెలంగాణ ప్రజలను అన్ని విధాలా ఏడిపించారని కేసీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల కోసమే పుట్టింది. మంచి ఎమ్మెల్యే గెలిస్తే మంచి ప్రభుత్వం వస్తుంది. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. BRS రైతుబంధు తీసుకొచ్చింది. అయితే ఇది వృధా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రైతులకు 3 గంటల కరెంటు సరిపోతుందని అంటున్నారు. అభ్యర్థుల లక్షణాలు మరియు పార్టీల చరిత్ర ఆధారంగా ఓటు వేయండి. ఓటు వేస్తే మన రూపురేఖలే మారిపోతాయని అన్నారు.
EV Charging Stations: చార్జ్జోన్తో ఎంజీ మోటార్ టై అప్.. పలు ప్రదేశాలలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు!
తాజావార్తలు
-
Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే…
-
Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
-
Jaya Bachchan: జాన్వీని ఒక వస్తువులా చూసినట్లున్నారు.. పెద్ది దర్శకుడిపై జయా బచ్చన్ విమర్శలు
-
Buchi Babu: నేను ఎలా నమ్మానో చరణ్ కూడా అలాగే నమ్మాడు.. ‘పెద్ది’ క్లైమాక్స్పై బుచ్చిబాబు ఎమోషనల్!
-
Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!