Medak Church: మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు.. భక్తుల రద్దీతో బయటనే ప్రార్థనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Christmas Celebrations Medak Church: మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందిన మెదక్ కేథడ్రల్ క్రిస్మస్ వేడుకలు మిన్నంటాయి. క్రిస్మస్ వేకల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై, గిరిజన అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డితో కలిసి చర్చి లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. కోవిడ్ను దృష్టిలో ఉంచుకుని క్రిస్మస్ వేడుకలకు చర్చ్ కు వచ్చే భక్తులు మాస్క్లు ధరించి హాజరయ్యారు. చర్చి లోపల ప్రేయర్ హాల్ భక్తులతో నిండిపోయింది. చర్చ్ బయటనే ప్రార్థనలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ) మెదక్ డియోసెస్ పరిధిలోని 13 జిల్లాల నుంచి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి లక్షలాది మంది భక్తులు మెదక్ చర్చికి తరలివచ్చారు. ఈ మేరకు చర్చి పాస్టోరేట్ కమిటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేశారు. చర్చి ప్రధాన టవర్, తోరణాలు, ప్రాంగణం, చర్చి లోపలి భాగాన్ని రంగురంగులగా అలంకరించారు. క్రీస్తు జన్మదిన విశేషాలను తెలిపేందుకు పెద్ద సైజు క్రిస్మస్ చెట్టు, పశువుల కొట్టం ఏర్పాటు చేశారు.
Read also: Traffic Diversions: రేపు రాష్ట్రానికి రాష్ట్రపతి.. 26 నుంచి 30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..

ఇవాళ తెల్లవారుజామున 4:30 గంటలకు చర్చిలో తొలి సేవతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. సిఎస్ఐ మెదక్ డయాసిస్ బిషప్ మోస్ట్ రెవరెండ్ ఎసి సాల్మన్ రాజ్ భక్తులనుద్దేశించి మాట్లాడారు. ఉదయం 9.30 గంటలకు రెండో సేవ అనంతరం భక్తులను చర్చికి అనుమతించారు. మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం బాలానగర్, ఎల్లారెడ్డి, చేగుంట, బొడ్మట్పల్లి రూట్ల నుంచి అదనపు బస్సులను ఆర్టీసీ మెదక్ డిపో మేనేజర్ రవిచంద్ర ఏర్పాటు చేశారు. సంగారెడ్డి డిపో నుంచి కూడా చాలా బస్సులు బయలుదేరుతాయి. మెదక్ పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలకు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. మెదక్ చర్చిలో దర్శనానికి, ప్రార్థనలకు లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్, వాహనాల పార్కింగ్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నారు.
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!