Medak Church: మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు.. భక్తుల రద్దీతో బయటనే ప్రార్థనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Christmas Celebrations Medak Church: మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందిన మెదక్ కేథడ్రల్ క్రిస్మస్ వేడుకలు మిన్నంటాయి. క్రిస్మస్ వేకల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై, గిరిజన అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డితో కలిసి చర్చి లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. కోవిడ్ను దృష్టిలో ఉంచుకుని క్రిస్మస్ వేడుకలకు చర్చ్ కు వచ్చే భక్తులు మాస్క్లు ధరించి హాజరయ్యారు. చర్చి లోపల ప్రేయర్ హాల్ భక్తులతో నిండిపోయింది. చర్చ్ బయటనే ప్రార్థనలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ) మెదక్ డియోసెస్ పరిధిలోని 13 జిల్లాల నుంచి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి లక్షలాది మంది భక్తులు మెదక్ చర్చికి తరలివచ్చారు. ఈ మేరకు చర్చి పాస్టోరేట్ కమిటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేశారు. చర్చి ప్రధాన టవర్, తోరణాలు, ప్రాంగణం, చర్చి లోపలి భాగాన్ని రంగురంగులగా అలంకరించారు. క్రీస్తు జన్మదిన విశేషాలను తెలిపేందుకు పెద్ద సైజు క్రిస్మస్ చెట్టు, పశువుల కొట్టం ఏర్పాటు చేశారు.
Read also: Traffic Diversions: రేపు రాష్ట్రానికి రాష్ట్రపతి.. 26 నుంచి 30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
Also Read
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
- CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం

ఇవాళ తెల్లవారుజామున 4:30 గంటలకు చర్చిలో తొలి సేవతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. సిఎస్ఐ మెదక్ డయాసిస్ బిషప్ మోస్ట్ రెవరెండ్ ఎసి సాల్మన్ రాజ్ భక్తులనుద్దేశించి మాట్లాడారు. ఉదయం 9.30 గంటలకు రెండో సేవ అనంతరం భక్తులను చర్చికి అనుమతించారు. మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం బాలానగర్, ఎల్లారెడ్డి, చేగుంట, బొడ్మట్పల్లి రూట్ల నుంచి అదనపు బస్సులను ఆర్టీసీ మెదక్ డిపో మేనేజర్ రవిచంద్ర ఏర్పాటు చేశారు. సంగారెడ్డి డిపో నుంచి కూడా చాలా బస్సులు బయలుదేరుతాయి. మెదక్ పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలకు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. మెదక్ చర్చిలో దర్శనానికి, ప్రార్థనలకు లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్, వాహనాల పార్కింగ్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నారు.
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
-
CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
-
Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!