New Rail Corridor: తూర్పు తీర ప్రాంతంలో కొత్త రైలు కారిడార్కు కేంద్రం గ్రీన్సిగ్నల్
- తూర్పు తీర ప్రాంతంలో కొత్త రైలు కారిడార్కు కేంద్రం గ్రీన్సిగ్నల్
- 4109.18 కోట్లతో 174 కి.మీ నిర్మాణం
తూర్పు తీర ప్రాంతంలో సమాంతరంగా మరో కొత్త రైలు కారిడార్కు గ్రీన్సిగ్నల్ పడింది. ప్రస్తుతం ఉన్న విజయవాడ-విశాఖ-భువనేశ్వర్-కోలకతా రైల్వే కారిడార్కు ప్రత్యామ్నాయంగా కొత్త రైలు కారిడార్ను కేంద్రం నిర్మించినుంది. అసన్సోల్ (బెంగాల్) నుంచి వరంగల్ వరకు సరికొత్త కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. జునాగఢ్- నవరంగ్పూర్, మల్కన్గిరి – పాండురంగాపురం వయా భద్రాచలం రైల్వే లైన్లు ఈ కారిడార్లు భాగంగా ఉంటాయి. 174 కిలోమీటర్లు మల్కన్గిరి (ఒడిస్సా)-పాండురంగాపురం, వయా భద్రాచలం వరకు ఈ రైల్వేలైన్ నిర్మాణానికి ఆమోదం లభించింది. మల్కన్ గిరి (ఒడిస్సా) నుంచి (వయా భద్రాచలం) పాండురంగాపురం ( తెలంగాణ) వరకు రూ.4,109.18 కోట్ల రూపాయలతో 174 కి.మీ కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు.
ఈ కొత్త రైల్వే కారిడార్ ఏపీలో 85.5 కి.మీ, తెలంగాణలో 19.77 కి.మీ పొడవు ఉంటుంది. గోదావరి నదిపై వంతెన నిర్మాణంతో సహా మొత్తం 174 కి.మీ వరకు ఈ రైల్వే కారిడార్ ఉండనుంది. ఈ కొత్త రైల్వే కారిడార్ ద్వారా పశ్చిమ, దక్షిణ ఒడిస్సా, ఛత్తీస్గఢ్ల నుంచి దక్షిణ భారతదేశానికి మరింత కనెక్టివిటీ పెరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లోని పలు బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు ఈ కారిడార్ ద్వారా బొగ్గు సరఫరా చేయవచ్చు. అలాగే ఈ కొత్త రైల్వే కారిడార్ ద్వారా 500-700 కి.మీ దూరం తగ్గుతుంది. తీర ప్రాంతంలో తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు, రాకపోకలకు అంతరాయం లేకుండా కొత్త రైల్వే కారిడార్కు రైళ్లను మళ్లించవచ్చు. తుఫాన్లు కారణంగా “హౌరా-విజయవాడ” తీర ప్రాంత రైల్వే మార్గానికి అంతరాయం కలిగినా కొత్త రైల్వే మార్గం ద్వారా ఒడిస్సాలోని పలు జిల్లాలకు రాకపోకలు సజావుగా సాగుతాయి. తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా, ఏపీలో తూర్పు గోదావరి జిల్లాతో పాటు.. ఒడిస్సా లోని పలు జిల్లాల్లో సామజిక ఆర్థికాభివృద్ధికి ఈ కొత్త రైల్వే మార్గం దోహదం చేస్తుంది.
Also Read
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
- Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
ఇక చాలా బిజీగా ఉండే విశాఖపట్నం-రాజమండ్రి రైల్వే కారిడార్పై ఒత్తిడి తగ్గేలా బైపాస్ చేస్తూ ఈ కొత్త కారిడార్కు రూపకల్పన చేశారు. దీనివల్ల దక్షిణ ఒడిస్సా, బస్తర్ ప్రాంతం నుంచి దక్షిణ భారతదేశానికి 124 కి.మీ దూరం కూడా తగ్గుతుంది. కొత్త రైల్వే కారిడార్ వల్ల ఆయా ప్రాంతాలకు ఆహార ధాన్యాలు, రసాయన ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్ రవాణా సులభమవుతుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
-
Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
-
మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్లో AI చిప్ అంటూ కారుకూతలు.!
-
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!