New Rail Corridor: తూర్పు తీర ప్రాంతంలో కొత్త రైలు కారిడార్కు కేంద్రం గ్రీన్సిగ్నల్
- తూర్పు తీర ప్రాంతంలో కొత్త రైలు కారిడార్కు కేంద్రం గ్రీన్సిగ్నల్
- 4109.18 కోట్లతో 174 కి.మీ నిర్మాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పు తీర ప్రాంతంలో సమాంతరంగా మరో కొత్త రైలు కారిడార్కు గ్రీన్సిగ్నల్ పడింది. ప్రస్తుతం ఉన్న విజయవాడ-విశాఖ-భువనేశ్వర్-కోలకతా రైల్వే కారిడార్కు ప్రత్యామ్నాయంగా కొత్త రైలు కారిడార్ను కేంద్రం నిర్మించినుంది. అసన్సోల్ (బెంగాల్) నుంచి వరంగల్ వరకు సరికొత్త కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. జునాగఢ్- నవరంగ్పూర్, మల్కన్గిరి – పాండురంగాపురం వయా భద్రాచలం రైల్వే లైన్లు ఈ కారిడార్లు భాగంగా ఉంటాయి. 174 కిలోమీటర్లు మల్కన్గిరి (ఒడిస్సా)-పాండురంగాపురం, వయా భద్రాచలం వరకు ఈ రైల్వేలైన్ నిర్మాణానికి ఆమోదం లభించింది. మల్కన్ గిరి (ఒడిస్సా) నుంచి (వయా భద్రాచలం) పాండురంగాపురం ( తెలంగాణ) వరకు రూ.4,109.18 కోట్ల రూపాయలతో 174 కి.మీ కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు.
ఈ కొత్త రైల్వే కారిడార్ ఏపీలో 85.5 కి.మీ, తెలంగాణలో 19.77 కి.మీ పొడవు ఉంటుంది. గోదావరి నదిపై వంతెన నిర్మాణంతో సహా మొత్తం 174 కి.మీ వరకు ఈ రైల్వే కారిడార్ ఉండనుంది. ఈ కొత్త రైల్వే కారిడార్ ద్వారా పశ్చిమ, దక్షిణ ఒడిస్సా, ఛత్తీస్గఢ్ల నుంచి దక్షిణ భారతదేశానికి మరింత కనెక్టివిటీ పెరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లోని పలు బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు ఈ కారిడార్ ద్వారా బొగ్గు సరఫరా చేయవచ్చు. అలాగే ఈ కొత్త రైల్వే కారిడార్ ద్వారా 500-700 కి.మీ దూరం తగ్గుతుంది. తీర ప్రాంతంలో తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు, రాకపోకలకు అంతరాయం లేకుండా కొత్త రైల్వే కారిడార్కు రైళ్లను మళ్లించవచ్చు. తుఫాన్లు కారణంగా “హౌరా-విజయవాడ” తీర ప్రాంత రైల్వే మార్గానికి అంతరాయం కలిగినా కొత్త రైల్వే మార్గం ద్వారా ఒడిస్సాలోని పలు జిల్లాలకు రాకపోకలు సజావుగా సాగుతాయి. తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా, ఏపీలో తూర్పు గోదావరి జిల్లాతో పాటు.. ఒడిస్సా లోని పలు జిల్లాల్లో సామజిక ఆర్థికాభివృద్ధికి ఈ కొత్త రైల్వే మార్గం దోహదం చేస్తుంది.
Also Read
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
ఇక చాలా బిజీగా ఉండే విశాఖపట్నం-రాజమండ్రి రైల్వే కారిడార్పై ఒత్తిడి తగ్గేలా బైపాస్ చేస్తూ ఈ కొత్త కారిడార్కు రూపకల్పన చేశారు. దీనివల్ల దక్షిణ ఒడిస్సా, బస్తర్ ప్రాంతం నుంచి దక్షిణ భారతదేశానికి 124 కి.మీ దూరం కూడా తగ్గుతుంది. కొత్త రైల్వే కారిడార్ వల్ల ఆయా ప్రాంతాలకు ఆహార ధాన్యాలు, రసాయన ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్ రవాణా సులభమవుతుంది.
తాజావార్తలు
-
Explainer: ‘2012’ సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
-
Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!