NTV Telugu Site icon

కేసీఆర్‌ సభపై రద్దు చేయండంటూ హైకోర్టులో పిటిషన్‌!

నాగార్జున సాగర్‌లో ఏర్పాటుచేయనున్న సీఎం సభను రద్దు చెయాలని యుగ తులసి ఫౌండేషన్ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతుండడంతో ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించొద్దని ప్రభుత్వం జీవో నెంబర్ 69 విడుదల చేసిందని కోర్టుకు తెలిపారు పిటిషనర్. అందుకే ఏప్రిల్ 14 న సీఎం కేసీఆర్ తలపెట్టిన సభను రద్దు చేయాలని కోర్టును కోరాడు పిటీషనర్ శివకుమార్‌. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సభను రద్దు చేయాలని కోరారు. ఈనెల 14న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కోసం సీఎం కేసీఆర్ సభ నిర్వహించనున్నారు.

అయితే ఈ సభపై స్థానిక రైతులు కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. తమ అనుమతి లేకుండా తమ భూముల్లో సభ పెడుతున్నారు అని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రైతులు. కోవిడ్ నిబంధనల ప్రకారం లక్ష మందితో సభ పెట్టడానికి వీల్లేదని చెబుతున్నారు. కోవిడ్ పేరుతో పండుగలు చేసుకోవద్దు అంటూ ప్రభుత్వం లక్ష మందితో సభ ఎలా పెడుతుంది అని రైతులు పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కేసీఆర్ సభ పై నీలి నీడలు అలుముకున్నాయి.